కంటైనర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరికి గాయాలు, పలువురికి స్వల్ప గాయాలు
కంటైనర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరికి గాయాలు, పలువురికి స్వల్ప గాయాలు
K.RAVI
హైదరాబాద్కు వస్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో కంటైనర్ను ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి.ఈ ఘటన మల్కాపురం చెరువు సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్రం గీతాంజలి (34), భరత్నగర్, మూసాపేట్, హైదరాబాద్ నివాసి, స్వస్థలం పోలవరం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆమె తన తల్లి తుర్రం సూర్య ప్రభావతి (60)తో కలిసి మార్చి 2న రాత్రి సుమారు 8:30 గంటలకు నిడదవోలు బస్టాండ్లో ఆర్టీసీ బస్సు నెంబర్ AP 39Z 0771(డ్రైవర్ దొర ప్రసాద్) గల దానిలో హైదరాబాద్కు బయలుదేరారు. మార్చి 3న ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో మల్కాపురం చెరువు వద్ద ముందుగా వెళ్తున్న కంటైనర్ నెంబర్ NL 01AJ 3979ను బస్సు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో గీతాంజలి, ఆమె తల్లి సూర్య ప్రభావతికి రక్తగాయాలు కాగా, బస్సులో ప్రయాణిస్తున్న మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్ సాయంతో గాయపడిన వారిని సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సి ఐ జి. మన్మధ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి