చిట్యాల:
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు చెందిన యువ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పలకలను పంపిణీ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ సేవే నిజమైన వేడుక అనే సందేశంతో విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చింతపల్లి ప్రవీణ్, ఎస్.కే. ఇబ్రాహీం, బొడ్డుపల్లి శ్రీను, సిలివేరు రిశ్వంత్, బొడ్డుపల్లి ఉపేందర్, గూడా అఖిల్, బొడ్డుపల్లి శ్రీశాంత్, ఎస్.కే. ఉస్మాన్, నరముల శివ, పల్లపు శ్రీకాంత్, తిరిపాల రాంచరణ్, శివాజీ తదితర యువ నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి