Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాలకూ చేరిన “స్థానికం” – ఆసక్తిగా చదువుతున్న ప్రజలు రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం: 100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 20, 2026 09:59 PM

కీటక జనిత వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి. డిఎంహెచ్ఓ డా. మనోహర్

కీటక జనిత వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి. డిఎంహెచ్ఓ డా. మనోహర్

కీటక జనిత వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి. డిఎంహెచ్ఓ డా. మనోహర్
April 20, 2026 07:56 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ హాల్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల విభాగాధిపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డా. మనోహర్ మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ‘ఫ్రైడే-డ్రై డే’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవడం, మురికి కాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిల్వ నీటిలో దోమల లార్వా అభివృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్, థీమాఫాస్ వంటి రసాయనాలను వినియోగించాలని తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రత పెంపొందించి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

డిపిఆర్ఓ నాగిరెడ్డి మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. ఎన్. వంశీకృష్ణ మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల నియంత్రణలో అన్ని శాఖల సహకారం అవసరమని తెలిపారు.

ఈ సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డా. రామకృష్ణ, డా. వీణతో పాటు మున్సిపల్, విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఐసిడిఎస్, డిపిఆర్ఓ, సోషల్ వెల్ఫేర్, బీసీ, ఎస్టీ వెల్ఫేర్, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా మలేరియా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News