Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 05:43 AM

కీటక జనిత వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి. డిఎంహెచ్ఓ డా. మనోహర్

కీటక జనిత వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి. డిఎంహెచ్ఓ డా. మనోహర్

కీటక జనిత వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి. డిఎంహెచ్ఓ డా. మనోహర్
April 20, 2026 07:56 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ హాల్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల విభాగాధిపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డా. మనోహర్ మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ‘ఫ్రైడే-డ్రై డే’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవడం, మురికి కాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిల్వ నీటిలో దోమల లార్వా అభివృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్, థీమాఫాస్ వంటి రసాయనాలను వినియోగించాలని తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రత పెంపొందించి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

డిపిఆర్ఓ నాగిరెడ్డి మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. ఎన్. వంశీకృష్ణ మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల నియంత్రణలో అన్ని శాఖల సహకారం అవసరమని తెలిపారు.

ఈ సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డా. రామకృష్ణ, డా. వీణతో పాటు మున్సిపల్, విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఐసిడిఎస్, డిపిఆర్ఓ, సోషల్ వెల్ఫేర్, బీసీ, ఎస్టీ వెల్ఫేర్, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా మలేరియా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News