కీటక జనిత వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి. డిఎంహెచ్ఓ డా. మనోహర్
కీటక జనిత వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి. డిఎంహెచ్ఓ డా. మనోహర్
Editor Desk
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ హాల్లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల విభాగాధిపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డా. మనోహర్ మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ‘ఫ్రైడే-డ్రై డే’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవడం, మురికి కాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిల్వ నీటిలో దోమల లార్వా అభివృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్, థీమాఫాస్ వంటి రసాయనాలను వినియోగించాలని తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రత పెంపొందించి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
డిపిఆర్ఓ నాగిరెడ్డి మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. ఎన్. వంశీకృష్ణ మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల నియంత్రణలో అన్ని శాఖల సహకారం అవసరమని తెలిపారు.
ఈ సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డా. రామకృష్ణ, డా. వీణతో పాటు మున్సిపల్, విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఐసిడిఎస్, డిపిఆర్ఓ, సోషల్ వెల్ఫేర్, బీసీ, ఎస్టీ వెల్ఫేర్, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా మలేరియా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి