Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 07:01 AM

కెమికల్ పరిశ్రమలు ఎత్తివేయాలి.సీపీఎం

కెమికల్ పరిశ్రమలు ఎత్తివేయాలి.సీపీఎం

కెమికల్ పరిశ్రమలు ఎత్తివేయాలి.సీపీఎం
April 21, 2026 04:05 PM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోచంపల్లి,

మండలంలోని దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాలలో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న కెమికల్ పరిశ్రమలను తక్షణం ఎత్తివేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.

మంగళవారం దోతిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. రసాయన పరిశ్రమల వ్యర్థాలు భూమిలోకి చేరి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయని, దీంతో తాగునీటి సమస్యతో పాటు ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాలుష్యం కారణంగా క్యాన్సర్, చర్మ, కిడ్నీ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మరోవైపు వ్యవసాయం దెబ్బతిని పంట నష్టాలు జరుగుతున్నాయని, రెండు గ్రామాల్లో సుమారు 200 ఎకరాలకు పైగా పంటలు నష్టపోతున్నాయని తెలిపారు. పాడి, కూరగాయలు, పండ్ల తోటల రైతులు, గీత కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

పరిశ్రమలు నిబంధనలు పాటించకుండా వాయు, జల కాలుష్యాన్ని పెంచుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. తక్షణం ఈ రెండు గ్రామాల్లో ఉన్న 11 రసాయన పరిశ్రమలను ఎత్తివేయాలని, లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, మాజీ మండల కార్యదర్శులు పగిళ్ల లింగారెడ్డి, ప్రసాదం విష్ణు, పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, మండల కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శికి మెమోరాండం అందజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News