Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్నారులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జూలైలోనే పీఎం కిసాన్ 23వ విడత?.. రైతులకు ఎదురుచూపులు! 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 06:17 PM

కెమికల్ పరిశ్రమలు ఎత్తివేయాలి.సీపీఎం

కెమికల్ పరిశ్రమలు ఎత్తివేయాలి.సీపీఎం

కెమికల్ పరిశ్రమలు ఎత్తివేయాలి.సీపీఎం
April 21, 2026 04:05 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోచంపల్లి,

మండలంలోని దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాలలో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న కెమికల్ పరిశ్రమలను తక్షణం ఎత్తివేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.

మంగళవారం దోతిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. రసాయన పరిశ్రమల వ్యర్థాలు భూమిలోకి చేరి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయని, దీంతో తాగునీటి సమస్యతో పాటు ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాలుష్యం కారణంగా క్యాన్సర్, చర్మ, కిడ్నీ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మరోవైపు వ్యవసాయం దెబ్బతిని పంట నష్టాలు జరుగుతున్నాయని, రెండు గ్రామాల్లో సుమారు 200 ఎకరాలకు పైగా పంటలు నష్టపోతున్నాయని తెలిపారు. పాడి, కూరగాయలు, పండ్ల తోటల రైతులు, గీత కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

పరిశ్రమలు నిబంధనలు పాటించకుండా వాయు, జల కాలుష్యాన్ని పెంచుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. తక్షణం ఈ రెండు గ్రామాల్లో ఉన్న 11 రసాయన పరిశ్రమలను ఎత్తివేయాలని, లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, మాజీ మండల కార్యదర్శులు పగిళ్ల లింగారెడ్డి, ప్రసాదం విష్ణు, పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, మండల కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శికి మెమోరాండం అందజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News