Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణలో అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 03:15 AM

కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలపై భారాలు : మల్లం మహేష్

కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలపై భారాలు : మల్లం మహేష్

కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలపై భారాలు : మల్లం మహేష్
May 29, 2026 05:03 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి.

డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రిక్షా తొక్కుతూ వినూత్న నిరసన

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం నకిరేకల్ కేంద్రంలో రిక్షా తొక్కుతూ వినూత్న నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. ఒకవైపు ప్రజల ఆదాయాలు తగ్గిపోతుండగా, మరోవైపు ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ప్రజల ఆదాయాలను పెంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పని చేయకుండా, మరింత భారాలు మోపుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. “మునిగే నక్కపై తాటి పండు పడ్డట్లు” కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజలపై అదనపు భారంగా మారాయని వ్యాఖ్యానించారు.

క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని చెబుతూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్న ప్రభుత్వం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు మాత్రం రూపాయి కూడా తగ్గించడం లేదని ఆరోపించారు. దేశం, ధర్మం పేరుతో మాట్లాడుతున్న పాలకులు ధరల మోతతో ప్రజలను బ్రతకనివ్వడం లేదన్నారు.

నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే దశలవారీగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ప్రజావ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యుడు బొడ్డుపల్లి నరేష్, నకిరేకల్, కేతపల్లి మండల కార్యదర్శులు సరికొండ శివ, కన్నెబోయిన వీరేశం, మండల నాయకులు దాసరి శంకర్, ఆదిమల్ల హరిహరన్, సరికొండ రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News