Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 08:04 AM

క్షేత్రస్థాయి సందర్శన శిక్షణలో అధికారుల పాత్ర కీలకం – జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

క్షేత్రస్థాయి సందర్శన శిక్షణలో అధికారుల పాత్ర కీలకం – జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

క్షేత్రస్థాయి సందర్శన శిక్షణలో అధికారుల పాత్ర కీలకం – జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
February 18, 2026 08:26 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

క్షేత్రస్థాయి సందర్శన శిక్షణ అధికారులు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.గ్రామ స్థాయిలో పథకాల అమలు, ప్రజల జీవన విధానం, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం వంటి అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే భవిష్యత్తులో సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందించగలమని ఆయన పేర్కొన్నారు.రెండు రోజుల శిక్షణలో భాగంగా జిల్లాకు చెందిన బడంపేట,సజ్జాపూర్,అనంతసాగర్, మల్లేపల్లి, గొంగళూరు, బస్వాపూర్, అరూర్,వెల్టూర్,అల్గోల్, మల్ చల్మా గ్రామాలను ఆరు శాఖలకు చెందిన 60 మంది గ్రూప్-వన్ అధికారులు సందర్శించి శిక్షణను పూర్తి చేశారు.అనంతరం బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.గ్రామాల్లో పాఠశాలలు, పీహెచ్‌సీలు, అంగన్వాడీ కేంద్రాలు, అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులను పరిశీలించిన అధికారులు గ్రామ ప్రజలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ మరియు జిల్లా అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమని, ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించడానికి కార్యనిర్వాహకంగా పనిచేయాలని సూచించారు. పరిపాలనలో పారదర్శకత, సమర్థత అత్యంత ముఖ్యమని వివరించారు.ఈ సందర్భంగా పలువురు గ్రూప్-వన్ అధికారులు గ్రామాల్లో ‘ఇందిరా మహిళ’ కార్యక్రమం సమర్థవంతంగా అమలవుతోందని, స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రత్యక్షంగా గమనించారని తెలిపారు.అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని, అభివృద్ధి బేషరము సాధించబడిందని కూడా పేర్కొన్నారు. ఈ పర్యటన తమకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, జడ్పీ సీఈవో జానకి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News