Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:36 AM

క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు

క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు

క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు
12-03-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: త్వరలో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులు ఆకాంక్షించారు. సోమందేపల్లిలోని క్రీస్తుజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం సరస్వతీ పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుడితో సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు, గురువులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని యాజమాన్యం, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు విద్యార్థులను ఆశీర్వదించారు.

అనంతరం వేద పండితుడు విద్యార్థులకు అమ్మవారి తీర్థ ప్రసాదం అందించి పరీక్షల్లో విజయవంతం కావాలని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ ప్రసాద్, ఎండీ అనిల్‌కుమార్, హెచ్‌ఎం హరినాథ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.


Sthanikam

క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు

Article Image

సోమందేపల్లి: త్వరలో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులు ఆకాంక్షించారు. సోమందేపల్లిలోని క్రీస్తుజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం సరస్వతీ పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుడితో సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు, గురువులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని యాజమాన్యం, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు విద్యార్థులను ఆశీర్వదించారు.

అనంతరం వేద పండితుడు విద్యార్థులకు అమ్మవారి తీర్థ ప్రసాదం అందించి పరీక్షల్లో విజయవంతం కావాలని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ ప్రసాద్, ఎండీ అనిల్‌కుమార్, హెచ్‌ఎం హరినాథ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News