కార్మిక–రైతు హక్కుల కోసం దేశవ్యాప్త సమ్మెకు పిలుపు. సిఐటియు
కార్మిక–రైతు హక్కుల కోసం దేశవ్యాప్త సమ్మెకు పిలుపు. సిఐటియు
Bandi Kiran Kumar
తుంగతుర్తి,: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా నాయకుడు బుర్ర శ్రీనివాస్ పిలుపునిచ్చారు.విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కార్పొరేట్ శక్తులు, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు కార్మిక, రైతు, పేద–మధ్యతరగతి వర్గాలపై భారాలు మోపుతున్నాయని విమర్శించారు. కార్మిక చట్టాల మార్పులు, ఔట్సోర్సింగ్–కాంట్రాక్ట్ విధానాల విస్తరణతో కార్మికుల హక్కులు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం ఉదయం 8 గంటలకు సమ్మె ప్రారంభమవుతుందని తెలిపారు. బిల్డింగ్ వర్కర్స్, హమాలీలు, గ్రామపంచాయతీ కార్మికులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది, వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి