Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై ఆందోళన పిలుపు కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 05:14 PM

కర్ల రాజేష్ లాకప్ డెత్ పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి

కర్ల రాజేష్ లాకప్ డెత్ పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి

కర్ల రాజేష్ లాకప్ డెత్ పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి
January 21, 2026 11:01 AM 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మార్పీఎస్, ప్రజాసంఘాల డిమాండ్

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రతరంమునగాల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులుగుడిపాటి కనకయ్య మాదిగమునగాల:మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో స్థానిక గ్రంథాలయంలో నిర్వహించిన పత్రిక మిత్రుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ మాట్లాడుతూ.కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ చిలుకూరు మండల పోలీస్ స్టేషన్ లో చిత్ర హింసలకు గురై కస్టోడియల్ డెత్ కి గురి కావడం జరిగింది.ఇట్టి కేసులో A1 గా ఉన్న చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి ని మాత్రం కాపాడుకొని ఎస్పీ ఆఫీసు అటాచ్ చేసి, కోదాడ సిఐ ప్రతాప లింగమును బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి సస్పెండ్ చేయడం జరిగింది,నవంబర్ 16 న మరణించిన కర్ల రాజేష్ నేటికీ రెండు నెలలు గడిచినా కూడా ఇంతవరకు ఎస్ఐ ని సస్పెండ్ చేయకపోవడం, వీరికి సూర్యాపేట జిల్లా డిఎస్పి,ఎస్పి సపోర్ట్ అందిస్తున్నారు, వీరందరికీ కూడా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, అలాగే సూర్యాపేట జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అండదండలతోనే నిర్లక్ష్యం చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తక్షణమే మౌనం వీడకపోతే, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రస్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తు, హెచ్చరిస్తున్నాం.పోలీసు వారు కూడా ఒకరిని కాపాడుకోవడం కోసం ఇంకొకరు, తప్పులు మీద తప్పులు చేస్తూ, పోలీసు వ్యవస్థ మీద గౌరవాన్ని పోగొట్టుకునే విధంగా తయారవుతున్నారు,కావున పోలీసు వారు కూడా ఇట్టి విషయంలో నిజాయితీగా పనిచేసి.వ్యవస్థ పై,చట్టాలపై గౌరవం పెరిగే విధంగా ఉండాలని, కర్ల రాజేష్ కస్టోడియల్ డెత్ కారకులైన వారి అందరిపై మర్డర్ కేసు, అట్రాసిటీ కేసు, నమోదు చేసి, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈకార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా ప్రధానకార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల మాజీ ఉపాధ్యక్షులు మొలుగూరి వెంకటేశ్వర్లు, లంజపల్లి వెంకటేశ్వర్లు, తదితరులుపాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News