కానిస్టేబుల్ నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు
కానిస్టేబుల్ నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు
GADDAM JAGANMOHAN REDDY
కానిస్టేబుల్గా ఎంపికై ప్రస్తుతం ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొందుతున్న ఇద్దరు ట్రైనీలు తమ కృషితో ఉన్నత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో సవర్ల శ్రీనాథ్ – గ్రూప్-2లో ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. కురవల్లి మదనమోహన్ రెడ్డి – డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు వారిని ప్రత్యేకంగా అభినందించి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. కఠినమైన పోలీస్ శిక్షణ మధ్య కూడా క్రమశిక్షణతో చదివి ఈ విజయాన్ని సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. వారి విజయం తోటి ట్రైనీలకు మరియు యువతకు స్ఫూర్తిదాయకమని, ఇక్కడితో ఆగకుండా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీటీసీ డీఎస్పీ ప్రసాద్, ఇన్స్పెక్టర్ రామారావు , ఆర్ఐ కృష్ణంరాజు గారు, ఇతర అధికారులు మరియు ట్రైనీలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి