Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ సాధనకు వాల్ పోస్టర్ ఆవిష్కరణ “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 04:38 PM

కంపచెట్లతో అడవిని తలపిస్తున్న వైకుంఠ ధామం..

కంపచెట్లతో అడవిని తలపిస్తున్న వైకుంఠ ధామం..

కంపచెట్లతో అడవిని తలపిస్తున్న వైకుంఠ ధామం..
April 03, 2026 02:50 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

స్మశానవాటికనా మత్తుబాబులకు అడ్డా నా.!

భయం గుప్పిట్లో స్థానికులు, కాలని వసూలు..

పట్టించుకోని నల్గొండ కార్పొరేషన్ అధికారులు..


నల్గొండ : అంతిమ యాత్రకు వెళ్లే వేళ.. ఆత్మీయులకు వీడ్కోలు పలికే చోట కనీస గౌరవం కరువైంది. నల్గొండ పురపాలక సంఘం 19వ డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ స్మశానవాటిక నేడు అధ్వాన స్థితికి చేరింది. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో వైకుంఠధామం కాస్తా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. స్మశానవాటిక అంతటా పిచ్చిమొక్కలు, ముళ్ల కంపలు విపరీతంగా పెరిగిపోయాయి. చూస్తుంటే ఇది స్మశానమా లేక దట్టమైన అడవి అన్న అనుమానం కలగక మానదు.

కంపచెట్ల పొదల మధ్య పాములు, తేళ్లు వంటివి సంచరిస్తుండటంతో స్థానికులు అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. పందుల స్వైర విహారం మరో ఎత్తు అంత్యక్రియల కోసం వచ్చే ప్రజలు ఈ కంపచెట్ల మధ్య నడవలేక నరకయాతన అనుభవిస్తున్నారు.


గంజాయి, మత్తు బాబులకు నిలయం..


​ఈ వైకుంఠ దామానికి సమీపంలోనే రైల్వే స్టేషన్ ఉండటం అసాంఘిక శక్తులకు వరంగా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కొందరు యువకులు ఇక్కడ గంజాయి సేవిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. చీకటి పడితే ఈ ప్రాంతం మత్తుబాబుల గుప్పిట్లోకి వెళ్తోంది. ఈ అరాచకాలపై ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని ఇక్కడి పరిస్థితి చూసి అటువైపు వెళ్లడానికే భయపడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నిరుపయోగంగా మౌలిక వసతులు..

​లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన మౌలిక వసతులు నేడు వృథాగా మారాయి. టాయిలెట్లు, బాత్రూమ్‌లు పూర్తిగా ముళ్లపొదలతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. తలుపులు విరిగిపోయి అపరిశుభ్రతతో నిండి ఉండటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో కనీసం లైట్లు కూడా వెలగకపోవడంతో చీకటిని ఆసరాగా చేసుకుని అసాంఘిక పనులు పెచ్చుమీరుతున్నాయని చనిపోయిన వారికి ప్రశాంతంగా వీడ్కోలు పలికే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ముళ్ల కంపల మధ్య అంత్యక్రియలు చేయడం ప్రాణసంకటంగా మారింది. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పిచ్చిమొక్కలను తొలగించాలి. నిరంతరం నిఘా ఏర్పాటు చేసి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా నిద్ర మత్తు వీడి ఈ శ్మశానవాటికకు మహర్దశ కల్పించాలని భద్రతా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు, శ్రీనగర్ కాలనీ నివాసితులు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News