కామినేని ఆసుపత్రి నుంచి వృద్ధుడు అదృశ్యం
కామినేని ఆసుపత్రి నుంచి వృద్ధుడు అదృశ్యం
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి ప్రాంతంలోని కామినేని ఆసుపత్రి నుంచి ఓ వృద్ధుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన టంగుటూరి ఎల్లయ్య (60)ను ఆరోగ్య పరీక్షల నిమిత్తం కుటుంబ సభ్యులు నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులను సంప్రదించేలోపే ఎల్లయ్య మతిస్థిమితం సరిగా లేక ఆసుపత్రి ప్రాంగణం నుంచి ఎక్కడికో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
తర్వాత ఎంత వెతికినా ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎల్లయ్య కూతురు మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై నార్కట్పల్లి ఎస్సై విష్ణుమూర్తి మాట్లాడుతూ వృద్ధుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా ఎల్లయ్య కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి