Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 05:09 AM

కామినేని ఆసుపత్రి నుంచి వృద్ధుడు అదృశ్యం

కామినేని ఆసుపత్రి నుంచి వృద్ధుడు అదృశ్యం

కామినేని ఆసుపత్రి నుంచి వృద్ధుడు అదృశ్యం
March 07, 2026 07:42 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి ప్రాంతంలోని కామినేని ఆసుపత్రి నుంచి ఓ వృద్ధుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన టంగుటూరి ఎల్లయ్య (60)ను ఆరోగ్య పరీక్షల నిమిత్తం కుటుంబ సభ్యులు నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులను సంప్రదించేలోపే ఎల్లయ్య మతిస్థిమితం సరిగా లేక ఆసుపత్రి ప్రాంగణం నుంచి ఎక్కడికో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

తర్వాత ఎంత వెతికినా ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎల్లయ్య కూతురు మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై నార్కట్‌పల్లి ఎస్సై విష్ణుమూర్తి మాట్లాడుతూ వృద్ధుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా ఎల్లయ్య కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News