కామర్స్లో అవగాహన పెంపుతో విస్తృత అవకాశాలు ఎన్జీ కళాశాలలో జీఎస్టీపై విస్తృత ఉపన్యాసం
కామర్స్లో అవగాహన పెంపుతో విస్తృత అవకాశాలు ఎన్జీ కళాశాలలో జీఎస్టీపై విస్తృత ఉపన్యాసం
స్థానికం బృందం
కామర్స్పై సమగ్ర అవగాహన పెంపొందించుకుంటే విద్యార్థులకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయని సముద్రాల ఉపేందర్తె లిపారు.
బుధవారం నాగార్జున గవర్నమెంట్ కాలేజీ లో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో “జీఎస్టీ సిద్ధాంతం మరియు అమలు” అంశంపై విస్తృత ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన లీగల్ క్రాఫ్ట్ ఇండియా కు చెందిన న్యాయవాది, పన్నుల నిపుణుడు G. సిద్దెశ్వర రావు ప్రధాన వక్తగా పాల్గొని విద్యార్థులకు జీఎస్టీ విధానం, దాని అమలు విధానాలపై వివరించారు.
విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఇలాంటి ఉపన్యాసాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాయోగిక శిక్షణ అందించడంలో సంబంధిత సంస్థల సహకారం అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగాధిపతి డా. జే. నాగరాజు, డా. సాలయ్య, జీ. సిద్ధేశ్వరావు, ఎస్. వాసుదేవు, ఎం. సావిత్రి, ఎస్.కె. వహీద్ బాబా, ఎన్. వెంకటరెడ్డి, ఏ. జాన్ రెడ్డి, ఎన్. శంకరయ్య, బీ. దినేష్, డి. వెంకటేష్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి