కామర్స్లో అవగాహన పెంచుకుంటే విస్తృత అవకాశాలు. డాక్టర్ సముద్రాల ఉపేందర్
కామర్స్లో అవగాహన పెంచుకుంటే విస్తృత అవకాశాలు. డాక్టర్ సముద్రాల ఉపేందర్
స్థానికం బృందం
నల్గొండ: కామర్స్ రంగంపై సమగ్ర అవగాహన పెంపొందించుకుంటే విద్యార్థులకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు.
బుధవారం కళాశాలలో కామర్స్ విభాగం మరియు హైదరాబాద్కు చెందిన లీగల్ క్రాఫ్ట్ ఇండియా సంస్థ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిర్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ శిక్షణ అందించడంలో ఆ సంస్థ సహకారం అందిస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగాధిపతి డా. జే. నాగరాజు, అధ్యాపకులు డాక్టర్ సాలయ్య, జీ. సిద్ధేశ్వరావు (అడ్వకేట్, టాక్స్ ప్రాక్టిషనర్), ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పరంగి రవికుమార్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి. మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజుతో పాటు అధ్యాపకులు ఎస్. వాసుదేవు, ఎం. సావిత్రి, ఎస్కే వహీద్ బాబా, ఎన్. వెంకటరెడ్డి, ఏ. జాన్ రెడ్డి, ఎన్. శంకరయ్య, బీ. దినేష్, డి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి