కలియుగ మహత్యాలు ఏ పని చేయడానికి కూడా వెనకడుగు వేయని యువత చివరకు ఏమౌతుందో
కలియుగ మహత్యాలు ఏ పని చేయడానికి కూడా వెనకడుగు వేయని యువత చివరకు ఏమౌతుందో
GADDAM JAGANMOHAN REDDY
ప్రియుడుతో లేచిపోవాలని రీనా అనే యువతి అతి తెలివి ప్రదర్శించింది . తాను నాగదేవతగా మారిపోయానని, నాగలోకానికి వెళ్లిపోతున్నానని తన అవతారాన్ని భూమి మీద చాలించానని తల్లిదండ్రులను నమ్మించేందుకు భలే ప్లాన్ చేసింది. ఆ యువతకి గ్రామంలోని ఓ యువకుడితో ప్రేమాయణం సాగుతోంది. యువకుడుతో లేచిపోవాలని ఉద్దేశంతో ఆ యువతి రెండు నెలల నుంచే తనకు కలలో నాగదేవతలు కనిపిస్తున్నారని, తనను రమ్మంటున్నారని చెప్తూ వచ్చేది. ఈలోగా సమీపంలోనే ఉన్న నాగదేవత ఆలయానికి వెళ్లి ఓ నాగ దేవత విగ్రహం తెచ్చుకుంది. అప్పటినుంచి పూజలు చేస్తోంది. ఆదివారం నాడు ఆలయానికి పోయి అక్కడ పాములు పట్టే వారితో మాట్లాడి ఐదు అడుగుల నాగు పాము కుబుసం తెచ్చుకుంది. రాత్రి బెడ్ మీద దాన్ని పెట్టి గాజులు, కుంకుమ అవన్నీ కూడా బెడ్ మీద పెట్టేసి తాను మానవ అవతారం ముగించి పై లోకానికి వెళ్లిపోయానని చెప్పేందుకు నమ్మించి ఆ రాత్రి ప్రియుడుతో లేచిపోయింది. ఉదయాన్నే తల్లిదండ్రులు అది చూసి కొంతవరకు నమ్మినా , తర్వాత పోలీసులు ఇది అమ్మాయి ఆడిన నాటకం అని చెప్పారు . ఆ యువతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడున్నాయో కనుక్కొని ఆ తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు .చూశారా ప్రేమ ఎంత డ్రామా ఆడించిందో..? సినిమా స్టైల్ లో తల్లిదండ్రులను నమ్మించేందుకు ఆ యువతి శతవిధాలా ప్రయత్నించి అద్భుతమైన నాటకానికి తెర తీసింది . ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలో సింగణపూర్ లో ఈ సంఘట జరిగింది..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి