Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 10:38 PM

కక్కిరేణి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు

కక్కిరేణి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు

కక్కిరేణి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు
11-03-2026 112 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పాఠశాలకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు.. విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల ప్రకటన

రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చిల్లా మధురవేణి సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు రూ.5,000 అందజేస్తామని ప్రకటించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై శ్రద్ధ పెట్టి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. వివిధ రంగాలలో ఉన్నత స్థానాలు సాధించేందుకు కృషి చేయాలని కోరారు.

విద్యార్థులు పరీక్షలను విజయవంతంగా ఎదుర్కోవాలని ఆకాంక్షిస్తూ ఉపాధ్యాయులు రాజన్ బాబు పరీక్షలకు అవసరమైన సామగ్రిని అందజేశారు. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మొదటి బహుమతి రూ.10,000, రెండో బహుమతి రూ.5,000గా ఇవ్వనున్నట్లు ఉపాధ్యాయులు శేఖర్ రెడ్డి ప్రకటించారు.

ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులు పాఠశాలకు రెండు సీలింగ్ ఫ్యాన్లు అందజేశారు. అలాగే అంకిరెడ్డి పరుశురాం, మిరియాల రామకృష్ణ కలిసి మరో రెండు సీలింగ్ ఫ్యాన్లను పాఠశాలకు విరాళంగా అందించారు.

గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ విద్యార్థులు ఆటలు, పాటలతో సభికులను అలరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నడిగోటి పాండు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.ఉపేందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమాశంకర్, ఏఏపీసీ చైర్మన్ చిల్లా ప్రభావతి, గ్రామ పెద్దలు పిట్ట రాంరెడ్డి, మడూరి సోమేశ్వరరావు, ఉపాధ్యాయులు భద్రయ్య, శ్రీనివాసరావు, జ్యోతి, విద్యారాణి, సామాజిక కార్యకర్త వేముల సైదులు, నడిగోటి గణేష్, సింగారం శ్రీను తదితరులు పాల్గొన్నారు.



Sthanikam

కక్కిరేణి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు

Article Image

పాఠశాలకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు.. విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల ప్రకటన

రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చిల్లా మధురవేణి సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు రూ.5,000 అందజేస్తామని ప్రకటించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై శ్రద్ధ పెట్టి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. వివిధ రంగాలలో ఉన్నత స్థానాలు సాధించేందుకు కృషి చేయాలని కోరారు.

విద్యార్థులు పరీక్షలను విజయవంతంగా ఎదుర్కోవాలని ఆకాంక్షిస్తూ ఉపాధ్యాయులు రాజన్ బాబు పరీక్షలకు అవసరమైన సామగ్రిని అందజేశారు. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మొదటి బహుమతి రూ.10,000, రెండో బహుమతి రూ.5,000గా ఇవ్వనున్నట్లు ఉపాధ్యాయులు శేఖర్ రెడ్డి ప్రకటించారు.

ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులు పాఠశాలకు రెండు సీలింగ్ ఫ్యాన్లు అందజేశారు. అలాగే అంకిరెడ్డి పరుశురాం, మిరియాల రామకృష్ణ కలిసి మరో రెండు సీలింగ్ ఫ్యాన్లను పాఠశాలకు విరాళంగా అందించారు.

గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ విద్యార్థులు ఆటలు, పాటలతో సభికులను అలరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నడిగోటి పాండు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.ఉపేందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమాశంకర్, ఏఏపీసీ చైర్మన్ చిల్లా ప్రభావతి, గ్రామ పెద్దలు పిట్ట రాంరెడ్డి, మడూరి సోమేశ్వరరావు, ఉపాధ్యాయులు భద్రయ్య, శ్రీనివాసరావు, జ్యోతి, విద్యారాణి, సామాజిక కార్యకర్త వేముల సైదులు, నడిగోటి గణేష్, సింగారం శ్రీను తదితరులు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News