Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైదరాబాద్‌లో యువజన కాంగ్రెస్ మహా ధర్నా కదం తొక్కిన గిల్.. కోల్‌కతాపై గుజరాత్‌ ఘన విజయం రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 18, 2026 09:14 PM

కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి: బీజేపీ మండిపాటు

కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి: బీజేపీ మండిపాటు

కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి: బీజేపీ మండిపాటు
April 18, 2026 07:53 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* మహిళా సాధికారతకు అడ్డంకి

​* చౌటుప్పల్‌లో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం

​* అడ్డుకున్న పోలీసులు - బీజేపీ శ్రేణుల నిరసన

మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం అడ్డంకిగా నిలుస్తోందని బీజేపీ మండల అధ్యక్షుడు కైరంకొండ అశోక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం చౌటుప్పల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.​ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. మహిళలకు సామాజిక న్యాయం చేయడంలో గానీ, వారికి సమాన హక్కులు కల్పించడంలో గానీ ఆ పార్టీకి ఎన్నడూ నిజమైన సంకల్పం లేదని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయని అన్నారు. నిరసనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. తమ నిరసనను అడ్డుకోవడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుజ్జుల సురేందర్ రెడ్డి, రమణ గోని శంకర్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ఆలే చిరంజీవి, బుడ్డ సురేష్, యాస అశోక్ రెడ్డి, ఉడుగు వెంకటేశం గౌడ్, పాలకుర్ల జంగయ్య గౌడ్, ఉబ్బు బుచ్చయ్య, గోష్క నీరజ, బర్మా నాగరాణి, కడెం భాగ్యమ్మ, బోడిగే పద్మ, కట్ట కృష్ణ, దిండు భాస్కర్, లగోని పాండు, కొయ్యాడ స్వామి గౌడ్, ఓరకంటి భాను, అమృత, దశరథ, మధు, లింగస్వామి, బతరాజు వెంకటేష్, వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News