Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం భూ వివాదాలకు చెక్… భూభారతి పోర్టల్‌కు శ్రీకారం “టికెట్ ఉంటే సీటు తప్పనిసరి… ఇది ప్రతి పౌరుని హక్కు!” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 07:58 PM

కేంద్ర ప్రభుత్వంపై కార్మిక సంఘాల గర్జన లేబర్ కోడ్ల రద్దుకు డిమాండ్..

కేంద్ర ప్రభుత్వంపై కార్మిక సంఘాల గర్జన లేబర్ కోడ్ల రద్దుకు డిమాండ్..

కేంద్ర ప్రభుత్వంపై కార్మిక సంఘాల గర్జన లేబర్ కోడ్ల రద్దుకు డిమాండ్..
April 01, 2026 03:48 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్లగొండలో కార్మిక సంఘాల భారీ నిరసన.. ‘బ్లాక్ డే’గా పాటింపు


నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న నాలుగు నూతన లేబర్ కోడ్లు కార్మిక వర్గంపై జరుగుతున్న తీవ్రమైన దాడి అని ఇవి చట్టాల మార్పు కాదని కార్మిక హక్కుల అపహరణేనని ఐక్య కార్మిక సంఘాల నేతలు ధ్వజమెత్తారు. జాతీయ పిలుపులో భాగంగా బుధవారం నల్లగొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ‘బ్లాక్ డే’ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరా రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్య, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు బొల్గురి నరసింహ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త కోడ్లు కార్మికుల శ్రమను చౌకగా మార్చి కేవలం కార్పొరేట్ సంస్థల లాభాల కోసమే రూపొందించిన దోపిడీ విధానాలని విమర్శించారు. పని గంటలను పెంచడం వల్ల కార్మికుల ఆరోగ్యం, జీవన నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 300 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థల్లో ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి లేకుండానే కార్మికులను తొలగించే అధికారాన్ని యాజమాన్యాలకు కట్టబెట్టడం వల్ల ఉద్యోగ భద్రత పూర్తిగా ప్రశ్నార్థకంగా మారుతుందని వారు హెచ్చరించారు. కార్మిక సంఘాల ఏర్పాటు సమ్మె చేసే హక్కులపై పరిమితులు విధించడం అంటే కార్మికుల గొంతు నొక్కడమేనని మండిపడ్డారు. పర్మినెంట్ ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రోత్సహిస్తూ కార్మికులను అస్థిరమైన జీవితంలోకి నెట్టేస్తున్నారని, కనీస వేతనాలు, బోనస్, సామాజిక భద్రత వంటి హక్కులను ఈ కోడ్లు బలహీనపరుస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను బలోపేతం చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన గౌరవప్రదమైన వేతనాలు అందించాలని కాంట్రాక్ట్ వ్యవస్థను తగ్గించి పర్మినెంట్ ఉద్యోగాలను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి సలీం, ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి సుంకిశాల వెంకన్న, ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి దొనకొండ వెంకన్న, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్, నాయకులు దండేపల్లి సత్తయ్య, అవుట రవి, ఎం. నందం, సంబి రెడ్డి, యూసుఫ్, నాగరాజు, నరసింహ, సీతరాములు, శంకర్, ఇందూరి సాగర్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News