Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:49 PM

జొన్న గింజ – బటాని గింజ దశలో రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఉద్యాన అధికారి పి. అపర్ణ

జొన్న గింజ – బటాని గింజ దశలో రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఉద్యాన అధికారి పి. అపర్ణ

జొన్న గింజ – బటాని గింజ దశలో రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఉద్యాన అధికారి పి. అపర్ణ
04-03-2026 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచిలో మామిడి పంటకు సస్యరక్షణ చర్యలు

కూసుమంచి మండలంలో మామిడి తోటలు ప్రస్తుతం జొన్న గింజ–బటాని గింజ దశలో ఉన్నాయని, ఈ దశలో సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోకపోతే దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని పాలేరు ఉద్యాన అధికారి పి. అపర్ణ తెలిపారు. మార్చి నెలలో వాతావరణ మార్పుల కారణంగా తెగుళ్లు, పురుగులు అధికమయ్యే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నల్ల మచ్చ తెగులు లక్షణాలు కనిపించినట్లయితే కార్బన్డిజం 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి లేదా కార్బన్డిజం + మ్యాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. తేనె మంచు పురుగు ఉధృతి ఉంటే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ లేదా థయోమిథాక్సమ్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

పిందెలు అధికంగా రాలుతున్నట్లయితే ప్లానోఫిక్స్ 4.5 మి.లీని 25 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. మందుల మోతాదులను ఖచ్చితంగా పాటించాలని, అవసరమైతే సమీప ఉద్యాన కార్యాలయాన్ని సంప్రదించాలని రైతులకు సూచించారు.

Sthanikam

జొన్న గింజ – బటాని గింజ దశలో రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఉద్యాన అధికారి పి. అపర్ణ

Article Image

కూసుమంచిలో మామిడి పంటకు సస్యరక్షణ చర్యలు

కూసుమంచి మండలంలో మామిడి తోటలు ప్రస్తుతం జొన్న గింజ–బటాని గింజ దశలో ఉన్నాయని, ఈ దశలో సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోకపోతే దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని పాలేరు ఉద్యాన అధికారి పి. అపర్ణ తెలిపారు. మార్చి నెలలో వాతావరణ మార్పుల కారణంగా తెగుళ్లు, పురుగులు అధికమయ్యే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నల్ల మచ్చ తెగులు లక్షణాలు కనిపించినట్లయితే కార్బన్డిజం 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి లేదా కార్బన్డిజం + మ్యాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. తేనె మంచు పురుగు ఉధృతి ఉంటే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ లేదా థయోమిథాక్సమ్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

పిందెలు అధికంగా రాలుతున్నట్లయితే ప్లానోఫిక్స్ 4.5 మి.లీని 25 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. మందుల మోతాదులను ఖచ్చితంగా పాటించాలని, అవసరమైతే సమీప ఉద్యాన కార్యాలయాన్ని సంప్రదించాలని రైతులకు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News