జొన్న గింజ – బటాని గింజ దశలో రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఉద్యాన అధికారి పి. అపర్ణ
జొన్న గింజ – బటాని గింజ దశలో రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఉద్యాన అధికారి పి. అపర్ణ
స్థానికం బృందం
కూసుమంచిలో మామిడి పంటకు సస్యరక్షణ చర్యలు
కూసుమంచి మండలంలో మామిడి తోటలు ప్రస్తుతం జొన్న గింజ–బటాని గింజ దశలో ఉన్నాయని, ఈ దశలో సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోకపోతే దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని పాలేరు ఉద్యాన అధికారి పి. అపర్ణ తెలిపారు. మార్చి నెలలో వాతావరణ మార్పుల కారణంగా తెగుళ్లు, పురుగులు అధికమయ్యే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నల్ల మచ్చ తెగులు లక్షణాలు కనిపించినట్లయితే కార్బన్డిజం 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి లేదా కార్బన్డిజం + మ్యాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. తేనె మంచు పురుగు ఉధృతి ఉంటే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ లేదా థయోమిథాక్సమ్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.
పిందెలు అధికంగా రాలుతున్నట్లయితే ప్లానోఫిక్స్ 4.5 మి.లీని 25 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. మందుల మోతాదులను ఖచ్చితంగా పాటించాలని, అవసరమైతే సమీప ఉద్యాన కార్యాలయాన్ని సంప్రదించాలని రైతులకు సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి