Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆర్టీసీ సమ్మెకు సర్పంచ్ విక్రమ్ సంఘీభావం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 03:02 PM

జియోట్యాగ్ పేరుతో పద్మశాలీలకు పెన్షన్ నిరాకరణా? జీవో కాపీ ఇవ్వాలని ఆర్టిఐ కింద వినతి.

జియోట్యాగ్ పేరుతో పద్మశాలీలకు పెన్షన్ నిరాకరణా? జీవో కాపీ ఇవ్వాలని ఆర్టిఐ కింద వినతి.

జియోట్యాగ్ పేరుతో పద్మశాలీలకు పెన్షన్ నిరాకరణా? జీవో కాపీ ఇవ్వాలని ఆర్టిఐ కింద వినతి.
March 04, 2026 01:59 PM 632 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఆసరా పెన్షన్ దరఖాస్తుల స్వీకరణలో జియోట్యాగ్ నెంబర్ తప్పనిసరి చేస్తున్న అధికారుల తీరుపై పద్మశాలీ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా నేత సమాచార హక్కు చట్టం–2005 సెక్షన్ 6(1) కింద రామన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

జియోట్యాగ్ నెంబర్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతిని అందించాలని ఎంపీడీవో కార్యాలయ సూపరిండెంట్ శ్రీనివాస రెడ్డిని కోరారు. జియోట్యాగ్ లేకపోవడంతో 50 సంవత్సరాలు దాటిన పలువురు పద్మశాలీలు ఆసరా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

మగ్గం నేసే ఒకరికి మాత్రమే జియోట్యాగ్ నెంబర్ ఇచ్చి, ఒక హెల్పర్‌కు అవకాశం కల్పించగా, మిగతా చేనేత కార్మికులను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. అర్హతను గ్రామ కార్యదర్శులు లేదా చేనేత సహకార సంఘాల ద్వారా ధ్రువీకరించి, నిజమైన చేనేత కార్మికులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రామన్నపేట మండల అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్, మండల ఉపాధ్యక్షుడు బత్తుల సత్యం, పట్టణ అధ్యక్షుడు దిండిగల రాములు, నాయకులు రాపోలు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News