జియోట్యాగ్ పేరుతో పద్మశాలీలకు పెన్షన్ నిరాకరణా? జీవో కాపీ ఇవ్వాలని ఆర్టిఐ కింద వినతి.
జియోట్యాగ్ పేరుతో పద్మశాలీలకు పెన్షన్ నిరాకరణా? జీవో కాపీ ఇవ్వాలని ఆర్టిఐ కింద వినతి.
స్థానికం బృందం
రామన్నపేట: ఆసరా పెన్షన్ దరఖాస్తుల స్వీకరణలో జియోట్యాగ్ నెంబర్ తప్పనిసరి చేస్తున్న అధికారుల తీరుపై పద్మశాలీ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా నేత సమాచార హక్కు చట్టం–2005 సెక్షన్ 6(1) కింద రామన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
జియోట్యాగ్ నెంబర్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతిని అందించాలని ఎంపీడీవో కార్యాలయ సూపరిండెంట్ శ్రీనివాస రెడ్డిని కోరారు. జియోట్యాగ్ లేకపోవడంతో 50 సంవత్సరాలు దాటిన పలువురు పద్మశాలీలు ఆసరా పెన్షన్కు దరఖాస్తు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
మగ్గం నేసే ఒకరికి మాత్రమే జియోట్యాగ్ నెంబర్ ఇచ్చి, ఒక హెల్పర్కు అవకాశం కల్పించగా, మిగతా చేనేత కార్మికులను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. అర్హతను గ్రామ కార్యదర్శులు లేదా చేనేత సహకార సంఘాల ద్వారా ధ్రువీకరించి, నిజమైన చేనేత కార్మికులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రామన్నపేట మండల అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్, మండల ఉపాధ్యక్షుడు బత్తుల సత్యం, పట్టణ అధ్యక్షుడు దిండిగల రాములు, నాయకులు రాపోలు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి