Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'చలో హైదరాబాద్‌'ను విజయవంతం చేయండి: సుర్కంటి శ్రీధర్ రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 09:12 PM

జియోట్యాగ్ పేరుతో పద్మశాలీలకు పెన్షన్ నిరాకరణా? జీవో కాపీ ఇవ్వాలని ఆర్టిఐ కింద వినతి.

జియోట్యాగ్ పేరుతో పద్మశాలీలకు పెన్షన్ నిరాకరణా? జీవో కాపీ ఇవ్వాలని ఆర్టిఐ కింద వినతి.

జియోట్యాగ్ పేరుతో పద్మశాలీలకు పెన్షన్ నిరాకరణా? జీవో కాపీ ఇవ్వాలని ఆర్టిఐ కింద వినతి.
March 04, 2026 01:59 PM 653 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఆసరా పెన్షన్ దరఖాస్తుల స్వీకరణలో జియోట్యాగ్ నెంబర్ తప్పనిసరి చేస్తున్న అధికారుల తీరుపై పద్మశాలీ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా నేత సమాచార హక్కు చట్టం–2005 సెక్షన్ 6(1) కింద రామన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

జియోట్యాగ్ నెంబర్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతిని అందించాలని ఎంపీడీవో కార్యాలయ సూపరిండెంట్ శ్రీనివాస రెడ్డిని కోరారు. జియోట్యాగ్ లేకపోవడంతో 50 సంవత్సరాలు దాటిన పలువురు పద్మశాలీలు ఆసరా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

మగ్గం నేసే ఒకరికి మాత్రమే జియోట్యాగ్ నెంబర్ ఇచ్చి, ఒక హెల్పర్‌కు అవకాశం కల్పించగా, మిగతా చేనేత కార్మికులను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. అర్హతను గ్రామ కార్యదర్శులు లేదా చేనేత సహకార సంఘాల ద్వారా ధ్రువీకరించి, నిజమైన చేనేత కార్మికులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రామన్నపేట మండల అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్, మండల ఉపాధ్యక్షుడు బత్తుల సత్యం, పట్టణ అధ్యక్షుడు దిండిగల రాములు, నాయకులు రాపోలు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News