జెండా వదలని కమ్యూనిస్టు.. బాయికాని నరసింహకు జోహార్లు. జహంగీర్
జెండా వదలని కమ్యూనిస్టు.. బాయికాని నరసింహకు జోహార్లు. జహంగీర్
Editor Desk
రామన్నపేట: కడదాకా నమ్మిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టని నిబద్ధత గల కమ్యూనిస్టు నాయకుడు బాయికాని నరసింహ అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు.
పల్లివాడకు చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు బాయికాని నరసింహ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, దశదినకర్మ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ, నరసింహ ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండి పోరాడిన నాయకుడని గుర్తు చేశారు.
అయన మృతి సిపిఎం ఉద్యమానికి తీరని లోటని పేర్కొంటూ, పేదల పక్షాన పోరాటం చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మాజీ ఉపసర్పంచ్ కల్లూరి నాగేష్, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కల్లూరి నాగమణి, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటపాక శివకుమార్, మండల నాయకులు వేముల సైదులు, పల్లె సత్యం, గ్రామ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి