Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:42 PM

జెండా వదలని కమ్యూనిస్టు.. బాయికాని నరసింహకు జోహార్లు. జహంగీర్

జెండా వదలని కమ్యూనిస్టు.. బాయికాని నరసింహకు జోహార్లు. జహంగీర్

జెండా వదలని కమ్యూనిస్టు.. బాయికాని నరసింహకు జోహార్లు. జహంగీర్
29-03-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: కడదాకా నమ్మిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టని నిబద్ధత గల కమ్యూనిస్టు నాయకుడు బాయికాని నరసింహ అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు.

పల్లివాడకు చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు బాయికాని నరసింహ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, దశదినకర్మ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ, నరసింహ ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండి పోరాడిన నాయకుడని గుర్తు చేశారు.

అయన మృతి సిపిఎం ఉద్యమానికి తీరని లోటని పేర్కొంటూ, పేదల పక్షాన పోరాటం చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మాజీ ఉపసర్పంచ్ కల్లూరి నాగేష్, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కల్లూరి నాగమణి, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటపాక శివకుమార్, మండల నాయకులు వేముల సైదులు, పల్లె సత్యం, గ్రామ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జెండా వదలని కమ్యూనిస్టు.. బాయికాని నరసింహకు జోహార్లు. జహంగీర్

Article Image

రామన్నపేట: కడదాకా నమ్మిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టని నిబద్ధత గల కమ్యూనిస్టు నాయకుడు బాయికాని నరసింహ అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు.

పల్లివాడకు చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు బాయికాని నరసింహ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, దశదినకర్మ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ, నరసింహ ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండి పోరాడిన నాయకుడని గుర్తు చేశారు.

అయన మృతి సిపిఎం ఉద్యమానికి తీరని లోటని పేర్కొంటూ, పేదల పక్షాన పోరాటం చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మాజీ ఉపసర్పంచ్ కల్లూరి నాగేష్, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కల్లూరి నాగమణి, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటపాక శివకుమార్, మండల నాయకులు వేముల సైదులు, పల్లె సత్యం, గ్రామ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News