జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి: టీజేఏ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షానూర్ బాబా
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి: టీజేఏ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షానూర్ బాబా
Editor Desk
యాదాద్రి భువనగిరి: తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టీజేఏ) జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షానూర్ బాబా జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆదివారం భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో ఏర్పాటు చేసిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో షానూర్ బాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇళ్ల స్థల సమస్యలను పరిష్కరించాలి, కార్పొరేట్ హాస్పిటల్స్లో హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలి, జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి అని తెలిపారు.
అలాగే, విధి నిర్వహణలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 20 లక్షల ఎక్సగ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, జర్నలిస్టులపై దాడులు జరగకుండా రక్షణ చట్టం అమలు చేయాలి, అక్రెడిటేషన్ కార్డులు వేగంగా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం పక్కన పెడతుంటే, పరిస్థితి “దారుణం”గా మారిందని ఆయన హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి