Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:14 PM

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి: టీజేఏ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షానూర్ బాబా

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి: టీజేఏ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షానూర్ బాబా

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి: టీజేఏ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షానూర్ బాబా
March 29, 2026 05:47 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టీజేఏ) జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షానూర్ బాబా జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆదివారం భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో షానూర్ బాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇళ్ల స్థల సమస్యలను పరిష్కరించాలి, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలి, జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి అని తెలిపారు.

అలాగే, విధి నిర్వహణలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 20 లక్షల ఎక్సగ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, జర్నలిస్టులపై దాడులు జరగకుండా రక్షణ చట్టం అమలు చేయాలి, అక్రెడిటేషన్ కార్డులు వేగంగా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో జర్నలిస్టుల సంక్షేమం పక్కన పెడతుంటే, పరిస్థితి “దారుణం”గా మారిందని ఆయన హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News