జనవరి ఇరవై నాలుగున చలో కోదాడకు వేలాదిగా తరలిరండి
జనవరి ఇరవై నాలుగున చలో కోదాడకు వేలాదిగా తరలిరండి
Editor Desk
బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తొగరు రమేష్ పిలుపు
మునగాల స్థానిక ప్రతినిధి పాముల రాఘవేందర్
కోదాడ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదేశాలతో ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి, పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ ఆరోపించారు. ఈ అన్యాయాలను నిరసిస్తూ జనవరి ఇరవై నాలుగున నిర్వహించనున్న చలో కోదాడ కార్యక్రమానికి మునగాల మండల వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మంగళవారం మునగాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని ప్రశ్నించిన బిఆర్ఎస్ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని విమర్శించారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తూ పోలీస్ రాజ్యం, లాఠీ రాజ్యం అమలు చేస్తున్నారని ఆరోపించారు.
కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్పై అక్రమంగా కేసులు నమోదు చేసి, కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్సైలు పథకం ప్రకారం చిత్రహింసలకు గురి చేయడంతో అతడు అనారోగ్యానికి గురై మరణించాడని ఆరోపించారు. నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతోందని, అధికార పార్టీ నాయకుల దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని అన్నారు.
గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వివిధ గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకత్వంపై జరిగిన దాడులు ఇందుకు నిదర్శనమని తెలిపారు. మునగాల మండలంలో నారాయణగూడెం దళితులపై, తిమ్మారెడ్డిగూడెం, మాధవరం గ్రామాలలో జరిగిన దాడుల పరంపర నేటికీ కొనసాగుతోందని విమర్శించారు.
ఈ దాడులను ఖండిస్తూ బిఆర్ఎస్ పార్టీ చలో కోదాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిందని, కావున బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని అధికార కాంగ్రెస్ పార్టీ ఆగడాలను ముక్తకంఠంతో ఖండించాలని తొగరు రమేష్ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి