Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 12:54 AM

జన్మదిన వేడుకల్లో గ్రామానికి నీటి శుద్ధి యంత్రం బహుమతి. ఎడ్ల మహేందర్ రెడ్డి

జన్మదిన వేడుకల్లో గ్రామానికి నీటి శుద్ధి యంత్రం బహుమతి. ఎడ్ల మహేందర్ రెడ్డి

జన్మదిన వేడుకల్లో గ్రామానికి నీటి శుద్ధి యంత్రం బహుమతి. ఎడ్ల మహేందర్ రెడ్డి
March 06, 2026 06:38 PM 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటా : ఎడ్ల మహేందర్ రెడ్డి

వెల్లంకిలో వాటర్ ఫిల్టర్, కూలర్ ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రం, శీతలీకరణ యంత్రాన్ని (వాటర్ ఫిల్టర్, వాటర్ కూలర్) గురువారం ప్రారంభించారు. బీఆర్ఎస్ జిల్లా నాయకులు, గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఏర్పాట్లు చేశారు.

గ్రామ సర్పంచ్ శ్రీమతి ఇడెం రాధా శ్రీనివాస్ తన సొంత నిధులు రూ.65 వేలతో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్, కూలర్‌ను ఎడ్ల మహేందర్ రెడ్డి–శిల్ప దంపతుల చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎడ్ల మహేందర్ రెడ్డి పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారని కొనియాడారు.

అనంతరం మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, గ్రామ ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అదే సందర్భంగా బీఆర్ఎస్ యువ నాయకుడు ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎడ్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు సహాయం అందిస్తానని తెలిపారు. సేవ చేయడానికి పదవులు అవసరం లేదని అన్నారు.

సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటూ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజకుమార్, వార్డు సభ్యులు నరేష్, శాంతి, లింగయ్య, మల్లమ్మ, జగన్, భాగ్యలక్ష్మి, ఉమా, బీఆర్ఎస్ నాయకులు పున్న వెంకటేశం, పిట్ట మహేందర్ రెడ్డి, యువ నాయకులు ఎడ్ల నరేందర్ రెడ్డి, ఇడెం శ్రీనివాస్, తలారి నరసింహ, పాశం సతీష్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, మాజీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News