Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణపై వ్యాఖ్యలు దేశద్రోహమే: కాంగ్రెస్ నేతలు ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 08:51 PM

జనగణన స్వీయ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సవిత

జనగణన స్వీయ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సవిత

జనగణన స్వీయ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సవిత
April 17, 2026 07:15 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: జనగణన 2027లో భాగంగా చేపట్టిన స్వీయ నమోదు (Self Enumeration) కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకుని తమ వివరాలను నమోదు చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత పిలుపునిచ్చారు.

పెనుకొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, దేశ అభివృద్ధి మరియు భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి అపోహలు లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

స్వీయ నమోదు ప్రక్రియలో అందించే వ్యక్తిగత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోబడవని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఆన్‌లైన్ పోర్టల్ https://se.census.gov.in లేదా మొబైల్ హౌస్ లిస్టింగ్ యాప్ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

ముందుగానే నమోదు చేసుకోవడం ద్వారా గణన ప్రక్రియ వేగవంతం అవుతుందని, ప్రజల సమయం ఆదా అవుతుందని చెప్పారు. జనగణనలో ఇచ్చే సమాచారం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఎటువంటి ప్రభావం చూపదని, కాబట్టి భయపడకుండా సరైన వివరాలు ఇవ్వాలని కోరారు.

జిల్లాలోని ప్రతి కుటుంబం ఈ 15 రోజుల స్వీయ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకుని జనగణనలో పాల్గొనాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. “జనగణనలో పాల్గొందాం… సమాజ అభివృద్ధికి తోడ్పడదాం” అని ఆమె అన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News