జనగణన స్వీయ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సవిత
జనగణన స్వీయ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సవిత
EDIGA NAVEENKUMAR
పెనుకొండ: జనగణన 2027లో భాగంగా చేపట్టిన స్వీయ నమోదు (Self Enumeration) కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకుని తమ వివరాలను నమోదు చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత పిలుపునిచ్చారు.
పెనుకొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, దేశ అభివృద్ధి మరియు భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి అపోహలు లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
స్వీయ నమోదు ప్రక్రియలో అందించే వ్యక్తిగత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోబడవని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఆన్లైన్ పోర్టల్ https://se.census.gov.in లేదా మొబైల్ హౌస్ లిస్టింగ్ యాప్ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ముందుగానే నమోదు చేసుకోవడం ద్వారా గణన ప్రక్రియ వేగవంతం అవుతుందని, ప్రజల సమయం ఆదా అవుతుందని చెప్పారు. జనగణనలో ఇచ్చే సమాచారం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఎటువంటి ప్రభావం చూపదని, కాబట్టి భయపడకుండా సరైన వివరాలు ఇవ్వాలని కోరారు.
జిల్లాలోని ప్రతి కుటుంబం ఈ 15 రోజుల స్వీయ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకుని జనగణనలో పాల్గొనాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. “జనగణనలో పాల్గొందాం… సమాజ అభివృద్ధికి తోడ్పడదాం” అని ఆమె అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి