Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 10:49 PM

జనగణన స్వీయ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సవిత

జనగణన స్వీయ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సవిత

జనగణన స్వీయ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సవిత
April 17, 2026 07:15 PM 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: జనగణన 2027లో భాగంగా చేపట్టిన స్వీయ నమోదు (Self Enumeration) కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకుని తమ వివరాలను నమోదు చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత పిలుపునిచ్చారు.

పెనుకొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, దేశ అభివృద్ధి మరియు భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి అపోహలు లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

స్వీయ నమోదు ప్రక్రియలో అందించే వ్యక్తిగత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోబడవని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఆన్‌లైన్ పోర్టల్ https://se.census.gov.in లేదా మొబైల్ హౌస్ లిస్టింగ్ యాప్ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

ముందుగానే నమోదు చేసుకోవడం ద్వారా గణన ప్రక్రియ వేగవంతం అవుతుందని, ప్రజల సమయం ఆదా అవుతుందని చెప్పారు. జనగణనలో ఇచ్చే సమాచారం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఎటువంటి ప్రభావం చూపదని, కాబట్టి భయపడకుండా సరైన వివరాలు ఇవ్వాలని కోరారు.

జిల్లాలోని ప్రతి కుటుంబం ఈ 15 రోజుల స్వీయ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకుని జనగణనలో పాల్గొనాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. “జనగణనలో పాల్గొందాం… సమాజ అభివృద్ధికి తోడ్పడదాం” అని ఆమె అన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News