జలం–జీవం నినాదంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గోరంట్ల మండలం వినాయకనగర్లో నిర్వహణ
జలం–జీవం నినాదంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గోరంట్ల మండలం వినాయకనగర్లో నిర్వహణ
Prakash
సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, ఏప్రిల్ 18:
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ ఆదేశాల మేరకు గోరంట్ల మండలంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. “జలం–జీవం” అనే ప్రధాన నినాదంతో గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలోని వినాయకనగర్లో ఈ కార్యక్రమం జరిగింది.
మండల స్పెషల్ ఆఫీసర్ సమత మేడం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిశుభ్రత, తాగునీటి సంరక్షణ, పరిసరాల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రజలు స్వచ్ఛతను అలవాటు చేసుకోవాలని, నీటి వనరులను సంరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి, పాలసముద్రం సింగిల్ విండో అధ్యక్షులు బెల్లల చెరువు చంద్ర, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు డి. ఉమాశంకర్, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, నిమ్మల శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి సంజయ్ నాయక్, హౌసింగ్ ఏఈ గణేష్, మైనారిటీ నాయకులు అజముతుల్లా, ఈశ్వర్, రోహిత్, శ్రీశైలం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి