జిల్లా కేంద్రానికి త్రిపుర గవర్నర్ రాక..
జిల్లా కేంద్రానికి త్రిపుర గవర్నర్ రాక..
NM Yadav
ఘన స్వాగతం పలికిన మంత్రి కోమటిరెడ్డి, అధికారులు..
నల్లగొండ : త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం నల్లగొండకు చేరుకున్న ఆయనకు స్థానిక రోడ్లు, భవనాల అతిథి గృహం (R&B Guest House) వద్ద ఘన స్వాగతం లభించింది. అతిథి గృహానికి చేరుకున్న గవర్నర్కు రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు.
అనంతరం జిల్లా యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డిలు గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ను కలిసిన వారిలో నల్లగొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. కొద్దిసేపు అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్న అనంతరం గవర్నర్ తన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. గవర్నర్ పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి