Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పట్టణాభివృద్ధికి వేగం… మౌలిక సదుపాయాలే తొలి ప్రాధాన్యం- చైర్మన్ పావని రమేష్ గౌడ్ బిడ్డను ఒడిలో, మందుల పెట్టె చేతిలో… నది దాటి టీకాలు ఇస్తున్న మంతి కుమారి “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 02, 2026 08:02 PM

జిల్లా కేంద్రానికి త్రిపుర గవర్నర్‌ రాక..

జిల్లా కేంద్రానికి త్రిపుర గవర్నర్‌ రాక..

జిల్లా కేంద్రానికి త్రిపుర గవర్నర్‌ రాక..
April 02, 2026 05:53 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ఘన స్వాగతం పలికిన మంత్రి కోమటిరెడ్డి, అధికారులు..

నల్లగొండ : త్రిపుర రాష్ట్ర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం నల్లగొండకు చేరుకున్న ఆయనకు స్థానిక రోడ్లు, భవనాల అతిథి గృహం (R&B Guest House) వద్ద ఘన స్వాగతం లభించింది. అతిథి గృహానికి చేరుకున్న గవర్నర్‌కు రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు.

అనంతరం జిల్లా యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డిలు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ను కలిసిన వారిలో నల్లగొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. కొద్దిసేపు అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్న అనంతరం గవర్నర్ తన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. గవర్నర్ పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News