Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:44 PM

ఇంటింటా సీపీఎం కార్యక్రమం జయప్రదం చేయాలి

ఇంటింటా సీపీఎం కార్యక్రమం జయప్రదం చేయాలి

ఇంటింటా సీపీఎం కార్యక్రమం జయప్రదం చేయాలి
05-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

ఈనెల 8వ తేదీ ఆదివారం నిర్వహించనున్న ‘ఇంటింటా సీపీఎం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన టౌన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా మండల కార్యదర్శి వర్గ సభ్యులు కందుల హనుమంతు, టౌన్ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. గ్రామాలు, వార్డుల వారీగా ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నట్లు చెప్పారు.

కార్యక్రమానికి Communist Party of India (Marxist) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జాంగిర్ హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టే పోరాటాలకు మేధావులు, సానుభూతిపరులు, ప్రజలు ఆర్థిక–హార్దిక సహకారం అందించాలని కోరారు.

సమావేశంలో మండల కమిటీ సభ్యులు బావండ్లపెళ్లి బాలరాజు, గొరిగే సోములు, పల్లె సత్యం, కడారి రాములు, విశ్వరూప చారి, కామిశెట్టి చంద్రశేఖర్, ఎన్. రాము తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంటింటా సీపీఎం కార్యక్రమం జయప్రదం చేయాలి

Article Image

రామన్నపేట,

ఈనెల 8వ తేదీ ఆదివారం నిర్వహించనున్న ‘ఇంటింటా సీపీఎం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన టౌన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా మండల కార్యదర్శి వర్గ సభ్యులు కందుల హనుమంతు, టౌన్ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. గ్రామాలు, వార్డుల వారీగా ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నట్లు చెప్పారు.

కార్యక్రమానికి Communist Party of India (Marxist) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జాంగిర్ హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టే పోరాటాలకు మేధావులు, సానుభూతిపరులు, ప్రజలు ఆర్థిక–హార్దిక సహకారం అందించాలని కోరారు.

సమావేశంలో మండల కమిటీ సభ్యులు బావండ్లపెళ్లి బాలరాజు, గొరిగే సోములు, పల్లె సత్యం, కడారి రాములు, విశ్వరూప చారి, కామిశెట్టి చంద్రశేఖర్, ఎన్. రాము తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News