Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 05, 2026 05:29 PM

ఇంటింటా సీపీఎం కార్యక్రమం జయప్రదం చేయాలి

ఇంటింటా సీపీఎం కార్యక్రమం జయప్రదం చేయాలి

ఇంటింటా సీపీఎం కార్యక్రమం జయప్రదం చేయాలి
March 05, 2026 03:21 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

రామన్నపేట,

ఈనెల 8వ తేదీ ఆదివారం నిర్వహించనున్న ‘ఇంటింటా సీపీఎం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన టౌన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా మండల కార్యదర్శి వర్గ సభ్యులు కందుల హనుమంతు, టౌన్ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. గ్రామాలు, వార్డుల వారీగా ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నట్లు చెప్పారు.

కార్యక్రమానికి Communist Party of India (Marxist) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జాంగిర్ హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టే పోరాటాలకు మేధావులు, సానుభూతిపరులు, ప్రజలు ఆర్థిక–హార్దిక సహకారం అందించాలని కోరారు.

సమావేశంలో మండల కమిటీ సభ్యులు బావండ్లపెళ్లి బాలరాజు, గొరిగే సోములు, పల్లె సత్యం, కడారి రాములు, విశ్వరూప చారి, కామిశెట్టి చంద్రశేఖర్, ఎన్. రాము తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News