Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:29 PM

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్నిఆకస్మికంగా తనిఖీ

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్నిఆకస్మికంగా తనిఖీ

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్నిఆకస్మికంగా తనిఖీ
04-03-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.బుధవారం యాదగిరిగుట్టలో గల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్నతీరును నిశితంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్...మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా,పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను,సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం తనిఖీచేశారు. ప్రశాంతవాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలన్నారు.మాల్ ప్రాక్టీస్ కి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జవాబు పత్రాల రవాణాకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యేంతవరకు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్నిఆకస్మికంగా తనిఖీ

Article Image

జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.బుధవారం యాదగిరిగుట్టలో గల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్నతీరును నిశితంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్...మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా,పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను,సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం తనిఖీచేశారు. ప్రశాంతవాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలన్నారు.మాల్ ప్రాక్టీస్ కి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జవాబు పత్రాల రవాణాకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యేంతవరకు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News