Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 04, 2026 08:29 PM

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్నిఆకస్మికంగా తనిఖీ

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్నిఆకస్మికంగా తనిఖీ

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్నిఆకస్మికంగా తనిఖీ
March 04, 2026 07:10 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.బుధవారం యాదగిరిగుట్టలో గల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్నతీరును నిశితంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్...మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా,పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను,సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం తనిఖీచేశారు. ప్రశాంతవాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలన్నారు.మాల్ ప్రాక్టీస్ కి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జవాబు పత్రాల రవాణాకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యేంతవరకు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News