ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
Biksham
విద్యార్థులకు డిఐఈఓ భాను నాయక్ సూచన
ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా విద్యాశాఖాధికారి భాను నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ పెరుమళ్ల యాదయ్య ఆధ్వర్యంలో వీడ్కోలు వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థి దశలో ఏకాగ్రతతో చదివితే భవిష్యత్తు సంతోషకరంగా ఉంటుందని తెలిపారు. సెల్ఫోన్ల వినియోగాన్ని తగ్గించుకోవాలని హితవు పలికారు.ప్రారంభంలోనే తప్పటడుగు వేస్తే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.
అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ ప్రసాద్, బి వాసు, ఎస్ కె భాషీరునిస బేగం, జి సైదులు, ఆర్ గురవయ్య, బి గోపమని, బి లలిత, జి శ్రీనివాస్, టి రమేష్, సిహెచ్ కృష్ణ, ఎం ప్రతాప్, టి వెంకటకృష్ణ, జి నవీన్ కుమార్, ఎస్ రవికుమార్, పి లక్ష్మయ్య, ఎం రమేష్, కే కుమారస్వామి, సిహెచ్ జ్యోతి, ఏ సాంబశివ రెడ్డి, పి చిరంజీవి, ఎం ప్రభాకర్ రెడ్డి, టి వసంతలక్ష్మి, పి నవీన్ కుమార్, ఎస్ కృష్ణారవింద్, వై రాణి, వి పున్నమ్మ, బి భాస్కర్, వై విద్యాసాగర్, సైదులు, ఆర్ చైతన్య, డాక్టర్ సతీష్, ఎం స్వాతి, జి సతీష్, ఈశ్వర చారి, డాక్టర్ ఎం చంద్రశేఖర్, శ్యాంసుందర్ రెడ్డి, రాజేశ్వరి, ఇందుమతి, లతీఫ్, అనురాధ, రజియా, సుల్తానా, లక్ష్మయ్య, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి