Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్ల బ్యాడ్జిలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన, శంకర్ గౌడ్‌కు ఘన నివాళి కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 12:34 PM

ఇరాన్‌పై దాడులను ఖండించాలి డి హరినాథ్

ఇరాన్‌పై దాడులను ఖండించాలి డి హరినాథ్

ఇరాన్‌పై దాడులను ఖండించాలి డి హరినాథ్
March 05, 2026 11:19 AM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేపడుతున్న దాడులను తీవ్రంగా ఖండించాలని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ అన్నారు. పశ్చిమ ఆసియాపై ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. ఈ యుద్ధోన్మాద చర్యలను ప్రపంచ ప్రజలంతా ఎదిరించాలని పిలుపునిచ్చారు.

ఇరాన్‌లోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 165 మంది బాలికలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని హరినాథ్ తెలిపారు. నిరపరాధులపై జరుగుతున్న దాడులు మానవత్వానికి మచ్చగా నిలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా చర్యలను ప్రశ్నించకపోవడం బాధాకరమని విమర్శించారు. గతంలో ఇరాక్‌పై తప్పుడు ఆరోపణలు చేసి సద్దాం హుస్సేన్‌ను హతమార్చిన ఘటనను గుర్తుచేశారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

ప్రపంచ దేశాలు తక్షణం యుద్ధాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని, శాంతి నెలకొనాలని హరినాథ్ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News