Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:31 AM

ఇరాన్‌పై దాడులను ఖండించాలి డి హరినాథ్

ఇరాన్‌పై దాడులను ఖండించాలి డి హరినాథ్

ఇరాన్‌పై దాడులను ఖండించాలి డి హరినాథ్
05-03-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేపడుతున్న దాడులను తీవ్రంగా ఖండించాలని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ అన్నారు. పశ్చిమ ఆసియాపై ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. ఈ యుద్ధోన్మాద చర్యలను ప్రపంచ ప్రజలంతా ఎదిరించాలని పిలుపునిచ్చారు.

ఇరాన్‌లోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 165 మంది బాలికలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని హరినాథ్ తెలిపారు. నిరపరాధులపై జరుగుతున్న దాడులు మానవత్వానికి మచ్చగా నిలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా చర్యలను ప్రశ్నించకపోవడం బాధాకరమని విమర్శించారు. గతంలో ఇరాక్‌పై తప్పుడు ఆరోపణలు చేసి సద్దాం హుస్సేన్‌ను హతమార్చిన ఘటనను గుర్తుచేశారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

ప్రపంచ దేశాలు తక్షణం యుద్ధాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని, శాంతి నెలకొనాలని హరినాథ్ కోరారు.

Sthanikam

ఇరాన్‌పై దాడులను ఖండించాలి డి హరినాథ్

Article Image

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేపడుతున్న దాడులను తీవ్రంగా ఖండించాలని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ అన్నారు. పశ్చిమ ఆసియాపై ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. ఈ యుద్ధోన్మాద చర్యలను ప్రపంచ ప్రజలంతా ఎదిరించాలని పిలుపునిచ్చారు.

ఇరాన్‌లోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 165 మంది బాలికలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని హరినాథ్ తెలిపారు. నిరపరాధులపై జరుగుతున్న దాడులు మానవత్వానికి మచ్చగా నిలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా చర్యలను ప్రశ్నించకపోవడం బాధాకరమని విమర్శించారు. గతంలో ఇరాక్‌పై తప్పుడు ఆరోపణలు చేసి సద్దాం హుస్సేన్‌ను హతమార్చిన ఘటనను గుర్తుచేశారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

ప్రపంచ దేశాలు తక్షణం యుద్ధాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని, శాంతి నెలకొనాలని హరినాథ్ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News