Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'చలో హైదరాబాద్‌'ను విజయవంతం చేయండి: సుర్కంటి శ్రీధర్ రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 10:00 PM

ఇరాన్‌పై దాడులను ఖండించాలి డి హరినాథ్

ఇరాన్‌పై దాడులను ఖండించాలి డి హరినాథ్

ఇరాన్‌పై దాడులను ఖండించాలి డి హరినాథ్
March 05, 2026 11:19 AM 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేపడుతున్న దాడులను తీవ్రంగా ఖండించాలని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ అన్నారు. పశ్చిమ ఆసియాపై ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. ఈ యుద్ధోన్మాద చర్యలను ప్రపంచ ప్రజలంతా ఎదిరించాలని పిలుపునిచ్చారు.

ఇరాన్‌లోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 165 మంది బాలికలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని హరినాథ్ తెలిపారు. నిరపరాధులపై జరుగుతున్న దాడులు మానవత్వానికి మచ్చగా నిలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా చర్యలను ప్రశ్నించకపోవడం బాధాకరమని విమర్శించారు. గతంలో ఇరాక్‌పై తప్పుడు ఆరోపణలు చేసి సద్దాం హుస్సేన్‌ను హతమార్చిన ఘటనను గుర్తుచేశారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

ప్రపంచ దేశాలు తక్షణం యుద్ధాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని, శాంతి నెలకొనాలని హరినాథ్ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News