ఇళ్లలో బంగారంపై మోదీ దృష్టి.. 32 వేల టన్నుల ‘గోల్డ్ రిజర్వ్’ను ఆర్థిక శక్తిగా మలచే యత్నం!
ఇళ్లలో బంగారంపై మోదీ దృష్టి.. 32 వేల టన్నుల ‘గోల్డ్ రిజర్వ్’ను ఆర్థిక శక్తిగా మలచే యత్నం!
Komidala Mahender reddy
దేశంలోని ఇళ్లలో, ఆలయాల్లో నిరుపయోగంగా నిల్వ ఉన్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీపిలుపునిచ్చారు. బంగారం రీసైక్లింగ్ను ప్రోత్సహించడం ద్వారా విదేశాల నుంచి బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, విలువైన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
దేశంలో ప్రస్తుతం సుమారు 30,000 నుంచి 32,000 టన్నుల మేర బంగారం ఇళ్లలో, దేవాలయాల్లో, ప్రైవేట్ నిల్వల రూపంలో ఉందని అంచనా. ఈ భారీ నిల్వలో కేవలం ఒక శాతం బంగారాన్ని మాత్రమే రీసైక్లింగ్ వ్యవస్థలోకి తీసుకువచ్చినా, బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని అంచనాల ప్రకారం దిగుమతులు 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగ దేశాల్లో ఒకటి. ప్రతి ఏడాది భారీ మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే ఇప్పటికే ఉన్న బంగారాన్ని ఆర్థిక వనరుగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
ప్రధాని పిలుపును జ్యువెలరీ సంఘాలు, బంగారం వ్యాపారులు, పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. గోల్డ్ రీసైక్లింగ్కు ప్రోత్సాహం లభిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని, బంగారం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని వారు అభిప్రాయపడ్డారు.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రజలు తమ వద్ద ఉన్న నిరుపయోగ బంగారాన్ని బ్యాంకులు, గోల్డ్ డిపాజిట్ పథకాల ద్వారా వ్యవస్థలోకి తీసుకువస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు అదనపు బలం చేకూరే అవకాశం ఉంది. బంగారం కేవలం ఆభరణంగా కాకుండా ఆర్థిక ఆస్తిగా మారితే దిగుమతి భారం తగ్గడంతో పాటు దేశ విదేశీ మారక నిల్వల పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని వారు పేర్కొంటున్నారు.‘ఇంట్లోని బంగారం.. దేశ ఆర్థికాభివృద్ధికి బంగారు బాట’ అనే సందేశంతో కేంద్రం గోల్డ్ రీసైక్లింగ్కు మరింత ఊతమివ్వనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి