ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లాలో వివిధ దశల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం బొమ్మలరామారం మండలం నాగినేపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడిన కలెక్టర్ గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయో, వాటిలో ఎన్ని ఇండ్లు పూర్తయ్యాయో, మిగిలినవి ఏ దశలో ఉన్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ను లబ్ధిదారులకు తక్కువ ధరలకు అందుబాటులో ఉంచి నిర్మాణ పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు నిర్మాణం పూర్తైన దశలకు అనుగుణంగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయా అని కూడా ఆరా తీశారు.
వివిధ దశల్లో నిలిచిపోయిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తే చివరి బిల్లు కూడా విడుదల అవుతుందని, లబ్ధిదారులు త్వరగా పనులు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి