Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:46 PM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
06-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో వివిధ దశల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం బొమ్మలరామారం మండలం నాగినేపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడిన కలెక్టర్ గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయో, వాటిలో ఎన్ని ఇండ్లు పూర్తయ్యాయో, మిగిలినవి ఏ దశలో ఉన్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను లబ్ధిదారులకు తక్కువ ధరలకు అందుబాటులో ఉంచి నిర్మాణ పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు నిర్మాణం పూర్తైన దశలకు అనుగుణంగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయా అని కూడా ఆరా తీశారు.

వివిధ దశల్లో నిలిచిపోయిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తే చివరి బిల్లు కూడా విడుదల అవుతుందని, లబ్ధిదారులు త్వరగా పనులు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లాలో వివిధ దశల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం బొమ్మలరామారం మండలం నాగినేపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడిన కలెక్టర్ గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయో, వాటిలో ఎన్ని ఇండ్లు పూర్తయ్యాయో, మిగిలినవి ఏ దశలో ఉన్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను లబ్ధిదారులకు తక్కువ ధరలకు అందుబాటులో ఉంచి నిర్మాణ పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు నిర్మాణం పూర్తైన దశలకు అనుగుణంగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయా అని కూడా ఆరా తీశారు.

వివిధ దశల్లో నిలిచిపోయిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తే చివరి బిల్లు కూడా విడుదల అవుతుందని, లబ్ధిదారులు త్వరగా పనులు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News