Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్ల బ్యాడ్జిలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన, శంకర్ గౌడ్‌కు ఘన నివాళి కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 12:12 PM

ఇందిరా మహిళా శక్తి పథకానికి మరొక బలమైన అడుగు

ఇందిరా మహిళా శక్తి పథకానికి మరొక బలమైన అడుగు

ఇందిరా మహిళా శక్తి పథకానికి మరొక బలమైన అడుగు
March 05, 2026 09:28 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఇందిరా మహిళా శక్తి పథకానికి మరొక బలమైన అడుగు

కోదాడలో ‘శ్రీనిధి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్’ ప్రారంభం

మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం కింద కోదాడ పట్టణంలో మరో స్వయం ఉపాధి కేంద్రం ప్రారంభించారు. కోదాడ పట్టణంలోని పాత పోస్ట్ ఆఫీస్ బజార్లో శ్రీనిధి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ ను కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబు, వైస్ చైర్పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఏ. రమాదేవి లు గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.పట్టణంలో ప్రారంభమైన శ్రీనిధి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు స్థానిక ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు. మహిళలు వ్యాపార రంగంలో ముందుకు రావాలని, స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని నాయకులు సూచించారు.ఇలాంటి వ్యాపారాల ద్వారా మహిళలు స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు సమాజంలో తమ స్థానం మరింత బలపరుచుకుంటారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మూడో వాడు కౌన్సిలర్ వంగూరీ గోపి, నాలుగో వార్డ్ కౌన్సిలర్ సుల్తానీ సుజాత రాంబాబు, మెప్మా సీఓ వెంకన్న, సి ఎల్ ఆర్ పి రాణి, నిర్వాహరాలు బచ్చలకూర అనూష ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News