Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 12:04 AM

ఇందిరా మహిళా శక్తి పథకానికి మరొక బలమైన అడుగు

ఇందిరా మహిళా శక్తి పథకానికి మరొక బలమైన అడుగు

ఇందిరా మహిళా శక్తి పథకానికి మరొక బలమైన అడుగు
March 05, 2026 09:28 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఇందిరా మహిళా శక్తి పథకానికి మరొక బలమైన అడుగు

కోదాడలో ‘శ్రీనిధి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్’ ప్రారంభం

మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం కింద కోదాడ పట్టణంలో మరో స్వయం ఉపాధి కేంద్రం ప్రారంభించారు. కోదాడ పట్టణంలోని పాత పోస్ట్ ఆఫీస్ బజార్లో శ్రీనిధి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ ను కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబు, వైస్ చైర్పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఏ. రమాదేవి లు గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.పట్టణంలో ప్రారంభమైన శ్రీనిధి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు స్థానిక ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు. మహిళలు వ్యాపార రంగంలో ముందుకు రావాలని, స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని నాయకులు సూచించారు.ఇలాంటి వ్యాపారాల ద్వారా మహిళలు స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు సమాజంలో తమ స్థానం మరింత బలపరుచుకుంటారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మూడో వాడు కౌన్సిలర్ వంగూరీ గోపి, నాలుగో వార్డ్ కౌన్సిలర్ సుల్తానీ సుజాత రాంబాబు, మెప్మా సీఓ వెంకన్న, సి ఎల్ ఆర్ పి రాణి, నిర్వాహరాలు బచ్చలకూర అనూష ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News