Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 13, 2026 05:23 PM

ఇందిరా మహిళా శక్తి భవనానికి శుభారంభం నిధానపల్లిలో ముగ్గు వేసి పనులకు శ్రీకారం. సర్పంచ్

ఇందిరా మహిళా శక్తి భవనానికి శుభారంభం నిధానపల్లిలో ముగ్గు వేసి పనులకు శ్రీకారం. సర్పంచ్

ఇందిరా మహిళా శక్తి భవనానికి శుభారంభం నిధానపల్లిలో ముగ్గు వేసి పనులకు శ్రీకారం. సర్పంచ్
March 13, 2026 03:37 PM 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

రామన్నపేట: మండలంలోని నిధానపల్లి గ్రామంలో నిర్మించనున్న ఇందిరా మహిళా శక్తి భవనానికి శుభారంభం జరిగింది. ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఈనెల 2న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేశారు.

తదుపరి పనులకు శ్రీకారం చుట్టుతూ శుక్రవారం గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణ స్థలంలో ముగ్గు వేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాల అభివృద్ధికి ఈ భవనం ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వి,సుమన్, వి బి కే నారపాక హారిక, గ్రామ పెద్దలు కొండ మల్లయ్య గౌడ్, కొండ మల్లేశం గౌడ్ భాష మల్ల సంతోష్, కొండ శేఖర్ గౌడ్, నారపాక లక్ష్మన్, నారపాక నరేష్ మహిళా సంఘం సభ్యులు కొండ పద్మ, నారపాక అనురాధ, గ్రామపంచాయతీ సిబ్బంది కడారి భాగ్య, వీరమల్ల వీరేశం రాచకొండ దాసులు, నారపాక అండాలు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News