Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 07, 2026 04:50 PM

ఇంద్రపాలనగరం రైతు వేదికలో రైతుల అవగాహన సదస్సు.

ఇంద్రపాలనగరం రైతు వేదికలో రైతుల అవగాహన సదస్సు.

ఇంద్రపాలనగరం రైతు వేదికలో రైతుల అవగాహన సదస్సు.
March 07, 2026 03:10 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

నానో ఎరువుల వాడకం, వరి పంటలో పురుగులు–తెగుళ్ల నివారణపై సూచనలు

ఇంద్రపాలనగరం క్లస్టర్ పరిధిలోని రైతు వేదికలో రైతులకు వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి అజాజ్ ఆలీఖాన్ ఆధ్వర్యంలో, మండల ఏఈవోలు కిరణ్, శ్రీనివాస్ సమన్వయంతో రైతులకు సమగ్ర వ్యవసాయం, నానో ఎరువుల వినియోగం, ప్రస్తుత వరి పంటలో వచ్చే పురుగులు, తెగుళ్ల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.

వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ నానో ఎరువులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగిస్తే పంట దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. వరి పంటలో ప్రస్తుతం కనిపిస్తున్న పురుగులు, తెగుళ్లను ముందుగానే గుర్తించి సరైన మందులను ఉపయోగించాలని రైతులకు సూచించారు. ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి రైతులు మందడి విద్యాసాగర్ రెడ్డి, రాజన్నగారి రమేష్, రవ్వ నర్సింహా, జిల్లాల ధనుంజయ, గర్ధాస్ వెంకటేష్, శివగల్ల ముత్యాలు, తుమ్మల శేఖర్, బోనగిరి సంజీవ, వెలిమినేటి నరేష్, గడ్డం సాయి, కుకూట్ల సత్తయ్య, ఈర్లపల్లి రమేష్, జిట్టబోయిన వెంకటేష్, రాధారపు నర్సింహా, రాధారపు మల్లేశం, రాస సత్తయ్య, నల్ల గిరిబాబు, పగుడాల సుదర్శన్, నీరుడు వెంకటేష్, మంటి బిక్షం, భూతం బిక్షం, మేకల నరేందర్, చిందం బిక్షపతి, కుకూట్ల సుధాకర్, మండల నర్సింహా, బోనగిరి మధు, మాధం నగేష్, పోతరాజు భాస్కర్, సింగణబోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News