Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 06:23 AM

ఇంద్రపాలనగరం లో బడి బాట కార్యక్రమం

ఇంద్రపాలనగరం లో బడి బాట కార్యక్రమం

ఇంద్రపాలనగరం లో బడి బాట కార్యక్రమం
April 21, 2026 01:25 PM 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విక్రమ్ పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంగ్లీష్ మీడియం ద్వారా బోధన, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నట్లు వివరించారు. అలాగే ఆటల ద్వారా అభ్యాసం, నెలకు ఒకసారి తల్లిదండ్రులతో సమావేశాలు (పిటిఎం), అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన వంటి అంశాలను వివరించారు.

విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫార్మ్‌లు అందించడంతో పాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. వారానికి మూడు గుడ్లు, మూడు రోజులు బెల్లంతో కూడిన రాగిజావా అందిస్తున్నట్లు చెప్పారు.

“మన పిల్లలను సర్కార్ బడుల్లో చదివించుకుందాం.. సర్కార్ బడులను కాపాడుకుందాం” అని విద్యార్థులు తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వరికుప్పల స్వామి, ప్రధానోపాధ్యాయులు కే.శేఖర్, ఉపాధ్యాయ బృందం, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తవుటం బిక్షపతి, మందడి విద్యాసాగర్ రెడ్డి, రాస వెంకటేష్, రవ్వ నర్సింహా, ఈరపల్లి మల్లయ్య, మందడి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News