Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెనుకొండలో అవగాహన ర్యాలీ: బాలికల భద్రత, రోడ్డు నియమాలపై చైతన్యం కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్‌కు కొత్త షరతులు… వినియోగదారుల ఇబ్బందులు 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 03:06 PM

ఇంద్రపాలనగరం లో బడి బాట కార్యక్రమం

ఇంద్రపాలనగరం లో బడి బాట కార్యక్రమం

ఇంద్రపాలనగరం లో బడి బాట కార్యక్రమం
April 21, 2026 01:25 PM 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విక్రమ్ పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంగ్లీష్ మీడియం ద్వారా బోధన, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నట్లు వివరించారు. అలాగే ఆటల ద్వారా అభ్యాసం, నెలకు ఒకసారి తల్లిదండ్రులతో సమావేశాలు (పిటిఎం), అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన వంటి అంశాలను వివరించారు.

విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫార్మ్‌లు అందించడంతో పాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. వారానికి మూడు గుడ్లు, మూడు రోజులు బెల్లంతో కూడిన రాగిజావా అందిస్తున్నట్లు చెప్పారు.

“మన పిల్లలను సర్కార్ బడుల్లో చదివించుకుందాం.. సర్కార్ బడులను కాపాడుకుందాం” అని విద్యార్థులు తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వరికుప్పల స్వామి, ప్రధానోపాధ్యాయులు కే.శేఖర్, ఉపాధ్యాయ బృందం, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తవుటం బిక్షపతి, మందడి విద్యాసాగర్ రెడ్డి, రాస వెంకటేష్, రవ్వ నర్సింహా, ఈరపల్లి మల్లయ్య, మందడి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News