ఇబ్రహీంపట్నం గురుకుల డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు.
ఇబ్రహీంపట్నం గురుకుల డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు.
Editor Desk
ఇబ్రహీంపట్నం,. ఏప్రిల్ 19: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి బీఏ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ హెచ్ రాధిక తెలిపారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించేందుకు వివిధ గ్రూపులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
కోర్సులు:
BA (HEP), BA (HEPA), BA (EPG), BA (EPJ), BA (EPP), BA (EPS), BA (HPML) గ్రూపుల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. వీటిలో చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, జర్నలిజం, సైకాలజీ, సోషియాలజీ, మోడరన్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) వంటి విషయాలు ఉన్నాయి.
అర్హతలు:
ఇంటర్మీడియట్లో కనీసం 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులు.
జత చేయాల్సిన పత్రాలు:
పదో తరగతి, ఇంటర్ మార్కుల మెమోలు, బోనాఫైడ్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రం (గ్రామీణం ₹1.50 లక్షలు, పట్టణం ₹2 లక్షలు లోపు), కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, దోస్త్ రిజిస్ట్రేషన్ కాపీ, AAPAR నంబర్, 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సమర్పించాలి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
9121004526, 7993065800
చిరునామా:
చైతన్యపురి మెట్రో స్టేషన్ సమీపంలో, చైతన్యపురి బస్ స్టాండ్ వెనుక సర్వీస్ రోడ్, నవత ట్రాన్స్పోర్ట్ పక్కన, పిల్లర్ నం. 1570 ఎదురు.
అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి