Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 01:28 AM

హైదరాబాద్‌లో యువజన కాంగ్రెస్ మహా ధర్నా

హైదరాబాద్‌లో యువజన కాంగ్రెస్ మహా ధర్నా

హైదరాబాద్‌లో యువజన కాంగ్రెస్ మహా ధర్నా
April 18, 2026 08:39 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. “మోడీ జీ కో హటావో – దేశ్ కీ బచావో” నినాదాలతో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను ఛిబ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, ఎమ్మెల్సీ విప్ అద్దంకి దయాకర్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్లమెంట్‌లో డిలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా–పాకిస్తాన్ విభజనతో పోల్చడం సరికాదని పేర్కొన్నారు.

అలాగే యూఎస్ ట్రేడ్ ఒప్పందాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఒప్పందాలు దేశ ఆర్థిక వ్యవస్థకు, స్థానిక వ్యాపారులకు నష్టం కలిగిస్తున్నాయని అన్నారు. దేశ స్వాభిమానానికి విరుద్ధమైన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోరారు.

ధర్నాకు వేలాదిగా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రావు, రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు కే.ఆర్. భవ్య, రోష్ని జైస్వాల్, జాతీయ కార్యదర్శి శ్రీనివాస్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News