Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:58 PM

హెయిర్ కటింగ్ విషయంలో జరిగిన పొరపాటుకు 25లక్షల నష్టపరిహారం

హెయిర్ కటింగ్ విషయంలో జరిగిన పొరపాటుకు 25లక్షల నష్టపరిహారం

హెయిర్ కటింగ్ విషయంలో జరిగిన పొరపాటుకు 25లక్షల నష్టపరిహారం
February 11, 2026 04:00 PM 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తనకు హెయిర్ కట్ చెప్పినట్టు చేయలేదని దానికి గలిగిన మానసిక క్షోభకు ,సర్వీసులో లోపానికి రెండు కోట్లు చెల్లించాలన్న హస్నారాయ్ అనే మహిళ విషయంలో కన్స్యూమర్ కోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు సవరించింది. దీంతో సుప్రీంకోర్టులో ఆ మహిళ హెయిర్ కట్ వివాదం ముగిసింది. ఢిల్లీలోని ఐటిసి మౌర్య హోటల్ రాయ్ అనే మహిళ 2018లో హెయిర్ కట్ చేయించుకుంది. ఈ సందర్భంగా హెయిర్ కట్ లో పొరపాటు చేశారని తాను చెప్పిన విధంగా చేయలేదని, దీనివల్ల తనకు చాలా మానసిక క్షోభ కలిగిందంటూ ఆమె కేసు వేసింది. ఈ కేసు విచారించిన వినియోగదారుల ఫోరం ఐటీసీ మౌర్య హోటల్ ను రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం ఆమెకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. హోటల్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు రెండు కోట్ల నష్టపరిహారం చాలా ఎక్కువ అని అభిప్రాయపడి, 25 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.తప్పుగా హెయిర్ కట్ చేయడం వల్ల తన వృత్తికి భంగం కలిగిందని , తాను ఎంతో మానసిక శోభకు గురయ్యానని, కొంతకాలం పాటు బయటకు పోలేక చాలా ఇబ్బంది పడ్డానని ఆ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కన్స్యూమర్ కోర్టు ఇచ్చిన రెండు కోట్ల నష్టపరిహారాన్ని సుప్రీంకోర్టు 25 లక్షలకు తగ్గించింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News