Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 10:03 PM

హెయిర్ కటింగ్ విషయంలో జరిగిన పొరపాటుకు 25లక్షల నష్టపరిహారం

హెయిర్ కటింగ్ విషయంలో జరిగిన పొరపాటుకు 25లక్షల నష్టపరిహారం

హెయిర్ కటింగ్ విషయంలో జరిగిన పొరపాటుకు 25లక్షల నష్టపరిహారం
February 11, 2026 04:00 PM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తనకు హెయిర్ కట్ చెప్పినట్టు చేయలేదని దానికి గలిగిన మానసిక క్షోభకు ,సర్వీసులో లోపానికి రెండు కోట్లు చెల్లించాలన్న హస్నారాయ్ అనే మహిళ విషయంలో కన్స్యూమర్ కోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు సవరించింది. దీంతో సుప్రీంకోర్టులో ఆ మహిళ హెయిర్ కట్ వివాదం ముగిసింది. ఢిల్లీలోని ఐటిసి మౌర్య హోటల్ రాయ్ అనే మహిళ 2018లో హెయిర్ కట్ చేయించుకుంది. ఈ సందర్భంగా హెయిర్ కట్ లో పొరపాటు చేశారని తాను చెప్పిన విధంగా చేయలేదని, దీనివల్ల తనకు చాలా మానసిక క్షోభ కలిగిందంటూ ఆమె కేసు వేసింది. ఈ కేసు విచారించిన వినియోగదారుల ఫోరం ఐటీసీ మౌర్య హోటల్ ను రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం ఆమెకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. హోటల్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు రెండు కోట్ల నష్టపరిహారం చాలా ఎక్కువ అని అభిప్రాయపడి, 25 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.తప్పుగా హెయిర్ కట్ చేయడం వల్ల తన వృత్తికి భంగం కలిగిందని , తాను ఎంతో మానసిక శోభకు గురయ్యానని, కొంతకాలం పాటు బయటకు పోలేక చాలా ఇబ్బంది పడ్డానని ఆ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కన్స్యూమర్ కోర్టు ఇచ్చిన రెండు కోట్ల నష్టపరిహారాన్ని సుప్రీంకోర్టు 25 లక్షలకు తగ్గించింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News