రామన్నపేట: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026’ను రామన్నపేట మండలంలో సీఐ ఎన్. వెంకటేశ్వరరావు, ఎస్ ఐ డి. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.
వారం రోజులుగా సాగిన ఈ కార్యక్రమంలో వాహనదారులు, ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లు, ట్రావెల్స్ యజమానులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై నాగరాజు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు.
మొబైల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి