హైవేల్లో డీజిల్ దొంగల ముఠా కట్టడి – నల్లగొండ పోలీసుల మెగా ఆపరేషన్
హైవేల్లో డీజిల్ దొంగల ముఠా కట్టడి – నల్లగొండ పోలీసుల మెగా ఆపరేషన్
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లాలో హైవేలను వేదికగా చేసుకుని డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఆగి ఉన్న లారీలు, భారీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్న ఈ గ్యాంగ్పై ప్రత్యేక బృందాలు దాడి చేసి మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. వారిలో ఒకరు మైనర్ కావడం గమనార్హం.నిందితుల వద్ద నుంచి సుమారు 1000 లీటర్ల డీజిల్, రెండు డీసీఎం వాహనాలు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోగా మొత్తం విలువ రూ.40 లక్షలుగా అంచనా. గతంలో కూడా వీరిపై తెలుగు రాష్ట్రాల్లో 20కు పైగా కేసులు నమోదైనట్లు విచారణలో తేలింది.డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో సీసీఎస్, చిట్యాల పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఈ అరెస్టులు జరిగాయి. డ్రైవర్లు నిద్రలో ఉన్న సమయంలో ట్యాంకుల నుంచి డీజిల్ దొంగిలించడం వీరి ప్రధాన విధానంగా పోలీసులు తెలిపారు.
హైవే ప్రయాణికులు అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే Dial-100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి