గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం
గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం
Editor Desk
రామన్నపేట మండలంలోని వెల్లంకి: గ్రామ ప్రాథమిక పాఠశాలలో విపంచి ఫౌండేషన్ సహకారంతో గురుకుల పాఠశాలలో సీట్లు పొందిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీమతి ఇడెం రాధ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు.
విపంచి ఫౌండేషన్ చైర్మన్ ఎనుమల శ్రీనివాస్, గౌరవ సలహాదారు నాగభూషణం, AAPC చైర్పర్సన్ పులగం సులోచన, ఉప సర్పంచ్ మిర్యాల రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు చేయూతనందిస్తున్న విపంచి ఫౌండేషన్ ప్రతినిధులను సర్పంచ్ ఇడెం రాధ శ్రీనివాస్, ఇడెం శ్రీనివాస్ సత్కరించారు.
గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాఠశాల అభివృద్ధికి తమ సహకారం కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇట్టె సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, దూదిగామ సువర్ణ, మందుగుల వెంకటయ్య, కోసనం మాధవి, నకిరేకంటి అశ్విని, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి