Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
108 ఉద్యోగుల చేయూతతో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 31, 2026 07:50 PM

గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం

గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం

గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం
March 31, 2026 05:20 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని వెల్లంకి: గ్రామ ప్రాథమిక పాఠశాలలో విపంచి ఫౌండేషన్ సహకారంతో గురుకుల పాఠశాలలో సీట్లు పొందిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీమతి ఇడెం రాధ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు.

విపంచి ఫౌండేషన్ చైర్మన్ ఎనుమల శ్రీనివాస్, గౌరవ సలహాదారు నాగభూషణం, AAPC చైర్‌పర్సన్ పులగం సులోచన, ఉప సర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు చేయూతనందిస్తున్న విపంచి ఫౌండేషన్ ప్రతినిధులను సర్పంచ్ ఇడెం రాధ శ్రీనివాస్, ఇడెం శ్రీనివాస్ సత్కరించారు.

గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాఠశాల అభివృద్ధికి తమ సహకారం కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇట్టె సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, దూదిగామ సువర్ణ, మందుగుల వెంకటయ్య, కోసనం మాధవి, నకిరేకంటి అశ్విని, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News