గురుకుల విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ – మేడి హరికృష్ణ
గురుకుల విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ – మేడి హరికృష్ణ
Editor Desk
చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్
తిప్పర్తి మండలం బండ్లవారి గూడెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్స్ను సోమవారం అందజేశారు.ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యే భవిష్యత్తుకు బాట వేసే ఆయుధమని, చిన్న వయస్సులోనే సరైన ప్రోత్సాహం లభిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తెలిపారు. గురుకుల పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్స్ ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థను అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి