PRINT TIME: July 02, 2026 01:32 AM
గుడి నిర్మాణానికి నీటి దోహదం.. బోరు వేయించిన పచ్చిమట్ల శివరాజ్ గౌడ్
గుడి నిర్మాణానికి నీటి దోహదం.. బోరు వేయించిన పచ్చిమట్ల శివరాజ్ గౌడ్
April 19, 2026 02:01 PM
21 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
భువనగిరి మండలం, గౌస్ నగర్ : గ్రామంలోని కాటమయ్య గుడి నిర్మాణానికి అవసరమైన నీటి సదుపాయం కోసం బోర్ వేయింపు కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు.
గ్రామ గౌడ సోదరులు సమస్యను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి బోర్ వేయించి మోటార్ అమర్చిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు కొబ్బరికాయ కొట్టి బోర్ త్రవ్వకాన్ని ప్రారంభించారు.
గుడి నిర్మాణానికి నీటి సమస్య తీరనుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ నాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గౌడ సోదరులు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి