Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 04, 2026 08:37 PM

గూడెం వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు

గూడెం వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు

గూడెం వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు
March 04, 2026 06:26 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిధిలోని శ్రీ ఆండాళ్, పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు బుధవారం ఉదయం అష్టోత్తర శతకలశాభిషేకం, 108 కళశాలతో మహాభిషేకం నిర్వహించారు. అనంతరం సుదర్శన హవనం భక్తి శ్రద్ధలతో సాగింది. సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం భక్తులను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఆలయ శాశ్వత చైర్మన్ సి హెచ్ వెంకటేశ్వరరావు, ఆలయ అధ్యక్షులు బి బాలమల్లు, ప్రధాన కార్యదర్శి టి రావు మాట్లాడుతూ గురువారం ఉదయం 10:30 గంటలకు శ్రీ ఆండాళ్, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సి హెచ్ అంజన్ రావు, సి హెచ్ రమాపతిరావు, బి రాజేశ్వరరావు, ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News