గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం స్థానికులతో కారులో వచ్చిన యువకుల హల్చల్
గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం స్థానికులతో కారులో వచ్చిన యువకుల హల్చల్
Komidala Mahender reddy
చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు బైకును ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి గాయపడినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తి పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నించారు.ఈ సందర్భంగా కారులో ఉన్న నలుగురు యువకులను ప్రమాదం ఎలా జరిగిందని స్థానికులు అడగగా, వారితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో యువకులు రాడ్డు తీసుకుని స్థానికులను కొట్టేందుకు ప్రయత్నించి అక్కడ హల్చల్ సృష్టించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచివారుకారుతోతప్పించుకున్నారని చెప్పారు.కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదానికి గల కారణాలు, కారులో వచ్చిన యువకుల వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి