Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:53 AM

గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం స్థానికులతో కారులో వచ్చిన యువకుల హల్చల్

గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం స్థానికులతో కారులో వచ్చిన యువకుల హల్చల్

గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం  స్థానికులతో కారులో వచ్చిన యువకుల హల్చల్
06-03-2026 320 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు బైకును ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి గాయపడినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తి పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నించారు.ఈ సందర్భంగా కారులో ఉన్న నలుగురు యువకులను ప్రమాదం ఎలా జరిగిందని స్థానికులు అడగగా, వారితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో యువకులు రాడ్డు తీసుకుని స్థానికులను కొట్టేందుకు ప్రయత్నించి అక్కడ హల్చల్ సృష్టించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచివారుకారుతోతప్పించుకున్నారని చెప్పారు.కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదానికి గల కారణాలు, కారులో వచ్చిన యువకుల వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Sthanikam

గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం స్థానికులతో కారులో వచ్చిన యువకుల హల్చల్

Article Image

చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు బైకును ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి గాయపడినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తి పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నించారు.ఈ సందర్భంగా కారులో ఉన్న నలుగురు యువకులను ప్రమాదం ఎలా జరిగిందని స్థానికులు అడగగా, వారితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో యువకులు రాడ్డు తీసుకుని స్థానికులను కొట్టేందుకు ప్రయత్నించి అక్కడ హల్చల్ సృష్టించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచివారుకారుతోతప్పించుకున్నారని చెప్పారు.కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదానికి గల కారణాలు, కారులో వచ్చిన యువకుల వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News