గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ – ఐదు కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు
గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ – ఐదు కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ మధ్యలోనే బ్రేక్డౌన్ కావడంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
లారీరోడ్డుమధ్యలోనిలిచిపోవడంతో రెండు వైపులా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర కార్లు, బస్సులు,లారీలుపొడవైనక్యూలలోనిలిచిపోయాయి. గంటల తరబడి ప్రయాణికులుతీవ్రఇబ్బందులుఎదర్కొన్నారు.సమాచారం అందినప్పటికీ సంబంధిత అధికారులు వెంటనే స్పందించకపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతరమైంది. హైవేపై ఇంత భారీగా ట్రాఫిక్ నిలిచిపోయినా అధికారులు పట్టించుకోకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అత్యవసర సేవల వాహనాలుకూడాట్రాఫిక్లోనేఇరుక్కుపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే చర్యలు తీసుకుని ట్రాఫిక్ను క్లియర్ చేయాలని స్థానికులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి