గుండ్రాంపల్లి సమీపంలో బైక్ ప్రమాదం యువకునికి తీవ్ర గాయాలు
గుండ్రాంపల్లి సమీపంలో బైక్ ప్రమాదం యువకునికి తీవ్ర గాయాలు
Komidala Mahender reddy
అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
యువకుడికి తీవ్ర గాయాలు, ఎస్ ఐ సకాలంలో స్పందన
చిట్యాల మండలం గుండ్రంపల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్దుల శ్రీకాంత్ పిట్టంపల్లి గ్రామం తన స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారంఅందించారు.సమాచారం అందుకున్న వెంటనే మామిడి రవికుమార్, చిట్యాల ఎస్సై, సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన శ్రీకాంత్ను అంబులెన్స్లో చౌటుప్పల్ లోని ఆసుపత్రికి తరలించారు. సమయానికి చికిత్స అందడంతో అతను ప్రాణాపాయం నుండి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు.ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు ఎస్సై సకాలంలో స్పందించి బాధితుడికి సహాయం చేసినందుకు అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి