Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసానికి కరాటే ఉత్తమ మార్గం:ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 14, 2026 02:31 AM

గ్రామాల అభివృద్ధిదే దేశ అభివృద్ధి

గ్రామాల అభివృద్ధిదే దేశ అభివృద్ధి

గ్రామాల అభివృద్ధిదే దేశ అభివృద్ధి
January 16, 2026 09:01 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk



-సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి.జహంగీర్


స్థానికం: భువనగిరి రిపోర్టర్ ఎన్.కుమార్


గ్రామాలు అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి చెందుతుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి.జహంగీర్ అన్నారు.స్థానికంగా శుక్రవారం రోజు భువనగిరిలోని సుందరయ్య భవనంలో పార్టీ మండల కమిటీ సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి.జహంగీర్ హాజరై మాట్లాడుతూ...గ్రామాలు అభివృద్ధి చెందుతనే దేశం అభివృద్ధి చెందుతుందని,గత రెండు సంవత్సరాల నుంచి గ్రామాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించక పోవడం గ్రామ పాలన అధికారి సర్పంచ్ లేకపోవడం వల్ల అభివృద్ధికి నోచుకోని పరిస్థితి నెలకొందని,గ్రామాల పరిపాలన అధికారిగా నియమించిన గాని గ్రామాలకు అభివృద్ధి ఆమడ దూరంలో ఉండిపోయిందని,ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెద్ద గ్రామాలకు 10 లక్షలు,చిన్న గ్రామాలకు ఐదు లక్షలు చొప్పున విడుదల చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలనిఅన్నారు.కేరళ రాష్ట్రం తరహా గ్రామాల అభివృద్ధి వైపు ఉండాలని అన్నారు,మన లరాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి వైపు ఆమడ దూరంలో ఉన్నాయి,కావున మన రాష్ట్రంలో కూడా గ్రామాలకు అధిక నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం ఉండాలని అన్నారు, విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలని అదేవిధంగా గతంలో ప్రారంభించిన పనులను పున ప్రారంభించాలన్నారు.గ్రామాలు అభివృద్ధి చెందుతూనే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు,ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య మండల కార్యవర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం,అన్నం పట్ల, కృష్ణ,కొండ అశోక్, కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు మోటే ఎల్లయ్య, మద్దెపురం బాల నరసింహ, కొండాపురం యాదగిరి తదితరులు పాల్గొన్నారు...*

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News